నేడు నగరంలో 42 కి.మీల మారథాన్… ట్రాఫిక్ మళ్లింపు
ఆదివారం నగరంలో హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 42 కి.మీల మేర మారథాన్ నిర్వహిస్తున్న సందర్భంగా సైబరాబాద్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. మళ్లీంచిన ట్రాఫిక్కు సంబంధించి వివరాలు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఆదివారం ఉదయం 5:00గంటలకు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద పరుగు ప్రారంభమై ఖైరతాబాద్ ఫ్లైఓవర్, రాజ్భవన్ రోడ్డు, రాజీవ్గాంధీ స్టాచ్యూ, సీఎం క్యాంపు ఆఫీసు, పంజాగుట్ట ఫ్లైఓవర్, శ్రీనగర్ కాలనీ, టీ జంక్షన్, సాగర్ సొసైటీ, ఎన్టీఆర్ భవన్, జూబ్లీహిల్స్ చెక్పోస్టు, […]
ఆదివారం నగరంలో హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 42 కి.మీల మేర మారథాన్ నిర్వహిస్తున్న సందర్భంగా సైబరాబాద్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. మళ్లీంచిన ట్రాఫిక్కు సంబంధించి వివరాలు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.
ఆదివారం ఉదయం 5:00గంటలకు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద పరుగు ప్రారంభమై ఖైరతాబాద్ ఫ్లైఓవర్, రాజ్భవన్ రోడ్డు, రాజీవ్గాంధీ స్టాచ్యూ, సీఎం క్యాంపు ఆఫీసు, పంజాగుట్ట ఫ్లైఓవర్, శ్రీనగర్ కాలనీ, టీ జంక్షన్, సాగర్ సొసైటీ, ఎన్టీఆర్ భవన్, జూబ్లీహిల్స్ చెక్పోస్టు, పెద్దమ్మ టెంపుల్, కావూరి హిల్స్ ఎక్స్రోడ్ ,అక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని మాదాపూర్ పోలీస్స్టేషన్ నుంచి ఇమేజ్ హాస్పిటల్, సైబర్ టవర్స్, అక్కడి నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని.. కేఎఫ్సీ, ట్రిడెంట్ఈ హోటల్, లెమన్ట్రీ, మైండ్స్పేస్ అండర్ పాస్ ద్వారా ఐకియా, మై హోం , బయోడైవర్సీటీ ఎక్స్రోడ్, ఇక అక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకుని సైబారాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం, గచ్చిబౌలి ఫ్లైఓవర్ రైట్ సైడ్ నుంచి ఇందిరానగర్, హిమగిరి హాస్పిటల్, ఐఐటీ జంక్షన్, విప్రో వద్ద రైట్ టర్న్ తీపుకొని క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్నపల్లి ఎక్స్రోడ్, అక్కడ రైట్ టర్న్ తీసుకొని హెచ్సీయూ వెస్ట్రన్ గేట్, యూనివర్సిటీ రెండవగేట్ వద్ద రైట్ టర్న్ తీసుకొని గచ్చిబౌలి స్టేడియం గేట్ నెంబర్-2 నుంచి హెచ్సీయూ రైట్ టర్న్ తీసుకున్న రన్నర్లు చివరకు మధ్యాహ్నం 12:00గంటలకు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంకు చేరుకుంటారు. దీంతో 42 కిలోమీటర్ల పరుగు ముగుస్తుందని తెలిపారు సజ్జనార్.
ఏకంగా 42 కిలోమీటర్ల రన్ కావడంతో రన్నర్లకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఆయా మార్గాల్లో వెళ్లే వాహనదారులు, ప్రజలు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.