రూ. 2 వేల కోట్ల బీరు నేలపాలు.. !
కరోనా ధాటికి ఎవ్వరైనా కుదేలు అవ్వాల్సిందే.. మందుబాబులను సైతం ఈ రాకాసి వదలడంలేదు. ముందే వేసవికాలం.. మండే ఎండలో బీరుతో సేదతీరుదామనుకున్న మందుబాబులకి ఇది చేదు వార్త! ప్రాణాంతక కరోనా వైరస్ను కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్తో బ్రిటన్లోని పబ్లన్ని మూతపడ్డాయి. దీంతో దాదాపు రూ.7 కోట్ల పింట్ల బీరు వృధా అవుతోంది. మార్చి 20వ తేదీన మూతపడిన పబ్లు జూలై నాలుగవ తేదీన తెరచుకోనున్నాయి. ఈ కారణంగా పబ్స్లో రూ. 7 కోట్ల పింట్ల బీరు […]
కరోనా ధాటికి ఎవ్వరైనా కుదేలు అవ్వాల్సిందే.. మందుబాబులను సైతం ఈ రాకాసి వదలడంలేదు. ముందే వేసవికాలం.. మండే ఎండలో బీరుతో సేదతీరుదామనుకున్న మందుబాబులకి ఇది చేదు వార్త!
ప్రాణాంతక కరోనా వైరస్ను కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్తో బ్రిటన్లోని పబ్లన్ని మూతపడ్డాయి. దీంతో దాదాపు రూ.7 కోట్ల పింట్ల బీరు వృధా అవుతోంది. మార్చి 20వ తేదీన మూతపడిన పబ్లు జూలై నాలుగవ తేదీన తెరచుకోనున్నాయి. ఈ కారణంగా పబ్స్లో రూ. 7 కోట్ల పింట్ల బీరు నిల్వ ఉండి పోయింది. అవి తెరచుకునే నాటికి బీరు ఎందుకు పనికి రాకుండా పోతుందని బ్రిటన్ బీర్ అండ్ పబ్ అసోసియేషన్ తెలిపింది. మన ఇండియా కరెన్సీలో దాని విలువ దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు.
అయితే ఇలా మిగిలి పోయిన బీరును సేంద్రీయ వ్యవసాయంలో ఎరువుగా, జంతువుల దాణగా వాడుకోవచ్చని అసోసియేషన్ చీఫ్ ఎమ్మా మార్క్క్లార్కిన్ తెలిపారు. కరోనా కారణంగా దెబ్బతిన్న వ్యవసాయాన్ని ఈ రకంగా ఆదుకునేందుకు బీరు ఉపయోగపడడం సంతోషకరంగా ఉన్నారు. లాక్డౌన్తో నష్టపోయిన బీరు తయారీ కేంద్రాలను, పబ్లను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.