గుడ్ న్యూస్: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు భారీ ఊరట..
కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ కట్టడికి ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం
Coronavirus Lockdown: కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ కట్టడికి ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేసింది. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించిన కొంతమంది వాహనదారులకు పోలీసులు భారీగా జరిమానా విధించారు.. వాహనాలను కూడా జప్తు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో దాదాపు 3.25 లక్షల కేసులు నమోదు అయ్యాయి.
కాగా.. మాములుగా అయితే, కోర్టులో జరిమానా చెల్లించి వాహనాలను విడిపించుకోవాల్సి ఉండేది. తాజాగా వాహనదారులకు పోలీసులు ఉపశమనం కలిగించారు. జరిమానా కట్టేందుకు కోర్టుకు వెళ్లకుండా ఈ-కోర్టు ద్వారా కేసుల పరిష్కారానికి పోలీసులు సమాయత్తమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు పరిష్కరించాలని కోర్టును పోలీసులు కోరారు. కోర్టు నుంచి సానుకూల స్పందన రావడంతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశ పెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. కేసులు నమోదైన వారికి ముందే తేదీ, టైం స్లాట్ ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
Also Read: త్వరలో.. పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ..