అమరవీరుడా..నీకు వేల..వేల వందనాలు….
ఇండియా-చైనా బోర్డర్ లో అమరుడైన కల్నల్ సంతోశ్ బాబు అంత్యక్రియలు గురువారం ఉదయం జరగనున్నాయి. సూర్యాపేట దగ్గర్లోని కేసారంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి
ఇండియా-చైనా బోర్డర్ లో అమరుడైన కల్నల్ సంతోశ్ బాబు అంత్యక్రియలు గురువారం ఉదయం జరగనున్నాయి. సూర్యాపేట దగ్గర్లోని కేసారంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. సైనిక, అధికార లాంఛనాల మధ్య సంతోశ్ బాబు ఆఖరి మజిలీ ముగియనుంది. అందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్… ఏర్పాట్లు పరిశీలించారు. కాగా సంతోశ్ బాబు పార్థీవ దేహాన్ని బంధువులు, సన్నిహితుల సందర్శనార్థం కొంతసేపు ఉంచాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో సూర్యాపేట విద్యానగర్లోని ఆయన స్వగృహాం వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో జనం చేరుకుండటంతో ఎక్కడికక్కడ… బారికేడ్లు ఏర్పాటు చేశారు. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో కల్నల్ ఇంటి వద్ద ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సోడియం హైపోక్లోరైడ్తో పరిసరాలను స్ప్రే చేశారు. కాగా సంతోశ్ బాబు దేశ కోసం ప్రాణాలు త్యాగం చేసిన తీరును దేశం మొత్తం కీర్తిస్తోంది.