డిగ్రీ విద్యార్థులకు అలెర్ట్.. దోస్త్ స్పెషల్డ్రైవ్లో సీట్లు పొందిన విద్యార్థులకు రిపోర్టింగ్ చేసేందుకు నేడే ఆఖరు
డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకోసం నిర్వహించిన దోస్త్ స్పెషల్డ్రైవ్లో సీట్లు పొందిన విద్యార్థులకు రిపోర్టింగ్ గడువు తేదీని బుధవారం వరకు పొడిగించారు.
DOST last date extended: డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకోసం నిర్వహించిన దోస్త్ స్పెషల్డ్రైవ్లో సీట్లు పొందిన విద్యార్థులకు రిపోర్టింగ్ గడువు తేదీని బుధవారం వరకు పొడిగించారు. ఈ మేరకు కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి ఒక ప్రకటన చేశారు. దోస్త్ ద్వారా డిగ్రీలో ప్రవేశాలు పొందిన అభ్యర్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, కేటాయించిన కాలేజీలలో రిపోర్టింగ్ చేయడం, ధ్రువీకరణ పత్రాలు సమర్పించడానికి డిసెంబర్ 9వ తేదీ వరకు పొడిగిస్తూ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీచేసింది. మంగళవారం భారత్బంద్ నేపథ్యంలో చాలామంది విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోలేకపోయారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు గడువు పెంచారు. సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కాలేజీల్లో సీసీఓటీపీ, తాత్కాలిక కేటాయింపు లేఖ, ఇతర అవసరమైన ప్రతాలను తీసుకెళ్లి రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
దోస్త్ను మొత్తం 5 విడతలలో కౌన్సిలింగ్ నిర్వహించగా.. 1,58,067 సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో మొత్తం 986 డిగ్రీ కాలేజీలుండగా ఇందులో 4,09,450 సీట్లున్నాయి. మొదటి రెండు విడతల్లో 1,44,886, మూడో విడతలో 57,695, ప్రత్యేక విడతలో 21,437 సీట్లు భర్తీ అయ్యాయి. చివరి విడతలో 27,365 మందికి సీట్లు ఖరారు చేశారు. దోస్త్ స్పెషల్ డ్రైవ్ ద్వారా 14,247 మంది అభ్యర్థులు ప్రవేశం పొందారు. అంతకు క్రితం చేపట్టిన దశల్లో మొత్తం 28,136 మంది అభ్యర్థులు ఆప్షన్లు ఇవ్వగా వీరిలో 27,365 మందికి సీట్లు కేటాయించారు.