వారు.. కావాలనే కరోనా అంటించుకున్నారు.. ఎందుకంటే..!
కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. అయినప్పటికీ కరోనా కేసులు ఆగడం లేదు. అమెరికాలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం
కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. అయినప్పటికీ కరోనా కేసులు ఆగడం లేదు. అమెరికాలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం విలవిలలాడుతోంది. ఇప్పటికే ఆ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14 లక్షలకు చేరుకుంది.
ఇదే అదనుగా భావించి.. అమెరికా లాస్ ఏంజిల్స్ లోని ఖైదీలు కొంత మంది దొంగ ఉపాయం వేశారు. కరోనా సోకితే జైలు నుంచి బయటకు పంపిస్తారని భావించిన ఖైదీలు.. ఏకంగా తమకు కరోనా అంటించుకునేందుకు ప్రయత్నించారు. కరోనా వైరస్ సోకిన తోటి ఖైదీల వద్దకు కావాలనే వెళ్లి వైరస్ అంటించుకునే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను జైలు అధికారులు గుర్తించారు.
కాగా.. కొంత మంది ఖైదీలు కావాలనే కరోనా వైరస్ అంటించుకున్నారని జైలు అధికారులు నిర్దారించుకున్నారు. తర్వాత వారిని ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహిచారు. మరోవైపు ఇందుకు సంబంధించిన వీడియోను జైలు అధికారులు మీడియాకు విడుదల చేశారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.