అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఎస్‌బీఐ కీలక నిర్ణయం..!

దేశంలో అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) తాజాగా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. రైతులకు ఉపయోగపడేలా కీలక నిర్ణయం తీసుకుంది. తన ఎస్‌బీఐ యోనో ప్లాట్‌ఫామ్‌కు సరికొత్త ఫీచర్‌ను

అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఎస్‌బీఐ కీలక నిర్ణయం..!
Follow us

| Edited By:

Updated on: Aug 14, 2020 | 5:00 PM

దేశంలో అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) తాజాగా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. రైతులకు ఉపయోగపడేలా కీలక నిర్ణయం తీసుకుంది. తన ఎస్‌బీఐ యోనో ప్లాట్‌ఫామ్‌కు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎస్‌బీఐ ఈ కొత్త ఫీచర్‌కు కిసాన్ క్రెడిట్ కార్డు రివ్యూ అని పేరు పెట్టింది. ఈ కొత్త ఫీచర్ సదుపాయంతో రైతులు ఇక బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పని లేదు. క్రెడిట్ కార్డు లిమిట్‌ పెంచుకోవడం కోసం అదేపనిగా ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లక్కర్లేదు.

కిసాన్ క్రెడిట్ కార్డు దారులు ఇంట్లో నుంచే ఎలాంటి డాక్యుమెంట్లతో పని లేకుండా సులభంగా కేసీసీ లిమిట్‌ను అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు లభించింది. ప్రస్తుతం రైతులు స్మార్ట్‌ఫోన్స్ కలిగి ఉన్నారని, అందుకే వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ఎస్‌బీఐ తెలిపింది. కేసీసీ రీయింబర్స్‌మెంట్ ఫీచర్ ద్వారా దాదాపు 75 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని బ్యాంక్ అంచనా వేసింది. యోనో కాటా, యోనో సేవింగ్స్, యోనో మిత్ర, యోనో మండి వంటి వాటి ద్వారా అన్నదాతలు ప్రయోజనం పొందొచ్చని బ్యాంక్ తెలిపింది.

Read More:

అమరావతి రైతులకు అన్యాయం జరగదు..!

సౌండ్ పొల్యూషన్ నిబంధనలు అతిక్రమిస్తే.. రూ.లక్ష జరిమానా..!