ఎన్నాళ్లకు ? ఎన్నాళ్లకు ? కనిపించాడో కిమ్ !
ఉత్తర కొరియా అధ్యక్ధుడు కిమ్ జోంగ్ ఉన్ ఇన్నాళ్లకు కనిపించాడు. రాజధాని ప్యాంగ్ యాంగ్ సమీపంలోని సన్ చాన్ ప్రాంతంలో ఓ ఎరువుల కర్మాగార ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యాడు. తమ నాయకుడు కనిపించగానే ఆయన సహచరులంతా హర్షాతిరేకంతో చప్పట్లు కొట్టారు....
ఉత్తర కొరియా అధ్యక్ధుడు కిమ్ జోంగ్ ఉన్ ఇన్నాళ్లకు కనిపించాడు. రాజధాని ప్యాంగ్ యాంగ్ సమీపంలోని సన్ చాన్ ప్రాంతంలో ఓ ఎరువుల కర్మాగార ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యాడు. తమ నాయకుడు కనిపించగానే ఆయన సహచరులంతా హర్షాతిరేకంతో చప్పట్లు కొట్టారు. కిమ్ మరణించాడనో, ఆయన ఆరోగ్యం విషమ స్థితిలో ఉందనో ఇన్ని రోజులుగా వఛ్చిన వార్తలకు తెర పడింది. తన తాత, తండ్రి పూర్తి చేయలేకపోయిన ఈ ఎరువుల కర్మాగారాన్ని తాను పూర్తి చేయగలిగానని ఈ సందర్భంగా కిమ్ అన్నాడు. ఇది తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. ఈ కార్యక్రమంలో ఆయన సోదరి కిమ్ యో జోంగ్ కూడా పాల్గొంది. కాగా అధికారిక మీడియాను తప్ప మిగతా జర్నలిస్టులనెవరినీ దీనికి ఆహ్వానించలేదు. దీంతో అంతర్జాతీయ సంస్థలు ఈ వార్తలను గానీ, ఈ ఫోటోలను గానీ ధృవీకరించాలేకపోయాయి.