కేరళలో కొత్తగా 4,138 మందికి కరోనా పాజిటివ్
దేశంలో మరోసారి కరోనా మెల్లమెల్లగా విస్తరిస్తుంది. అటు కేరళలో కరోనా వైరస్ బారినపడుతున్నవారి సంఖ్య ఏమాత్రం తగ్గడంలేదు.
దేశంలో మరోసారి కరోనా మెల్లమెల్లగా విస్తరిస్తుంది. అటు కేరళలో కరోనా వైరస్ బారినపడుతున్నవారి సంఖ్య ఏమాత్రం తగ్గడంలేదు. ఇప్పటికీ రోజుకు నాలుగు వేలకుపైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,138 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు కేరళ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, కొత్త కేసులతో సమానంగా రికవరీ రేటు ఉండటంతో కొంత ఊరట కలిగిస్తోంది. కాగా, గడిచిన 24 గంట వ్యవధిలో కొత్తగా 7,198 మంది వైరస్ బారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. అదేవిధంగా గత 24 గంటల్లో 21 మంది కరోనా బారిన పడి మృతిచెందారు. కాగా, కేరళలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో కరోనా మరణాల రేటు 0.34 శాతంగా ఉన్నది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.