పద్మనాభస్వామి ఆలయంపై కరోనా ప్రభావం
కేరళలో కరోనా కోరలు చాస్తోంది. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయంపై కరోనా ప్రభావం పడింది. ఆలయ ప్రధాన అర్చకుడు పెరియనంబి సహా 12 మంది ఆలయ సిబ్బందికి కరోనా పాజిటివ్..
Priests Have COVID : కేరళలో కరోనా కోరలు చాస్తోంది. రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయంపై కరోనా ప్రభావం పడింది. ఆలయ ప్రధాన అర్చకుడు పెరియనంబి సహా 12 మంది ఆలయ సిబ్బందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకున్నది.
అక్టోబర్ 15 వరకు ఆలయం మూసే ఉంటుందని పాలకమండలి ప్రకటించింది. భక్తులకు మాత్రమే ప్రవేశం ఉండదని, తక్కువ మంది సిబ్బందితో ఆలయంలో రోజువారి పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు పెరియనంబి ఆలయానాకి వచ్చేవరకు పూజా బాధ్యతలను మరో పూజారికి అప్పగించారు. ప్రధాన అర్చకుడి స్థానంలో తంత్రి సరననెళ్లూర్ సతీషన్ నంబూతిరిప్పడు ఆ బాధ్యతలను నిర్వర్తిస్తారు.
ఇదిలావుంటే కరోనా విస్తరణ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 21 నుంచి కేరళ పద్మనాభస్వామి ఆలయాన్ని మూసివేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ఆలయాలు తెరిచేందుకు అవకాశం ఇవ్వడంతో గత ఆగస్టు 27న ఆలయాన్ని తెరిచారు. ఇప్పుడు సిబ్బందికి కరోనా సోకడంతో మరోసారి తాత్కాలికంగా భక్తుల దర్శనాలను రద్దు చేశారు.