రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు 144 సెక్షన్
కేరళలో కరళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు కొవిడ్ కేసుల తీవ్రత మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో శనివారం నుంచి ఈ నెలాఖరు వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు
కేరళలో కరళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు కొవిడ్ కేసుల తీవ్రత మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో శనివారం నుంచి ఈ నెలాఖరు వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఎర్నాకుళం, కొట్టాయం జిల్లాల్లో కూడా 144 సెక్షన్ విధించినట్లు వెల్లడించారు.
బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు మించి ఎక్కువ మంది గుమిగూడకూడదని తెలిపారు. అయితే కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, మార్కెట్ల వద్ద కర్ఫ్యూలాంటి నిబంధనలు ఉండవని వెల్లడించారు. కేరళలో కొత్తగా జీరో కేసుల నమోదు నుంచి కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. గత 24 గంటల్లో కేరళలో కొత్తగా రికార్డు స్థాయిలో 9,258 కరోనా కేసులు నమోదయ్యాయి.
దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. సెప్టెంబర్ వరకు లక్ష కేసులు ఉండగా అనంతరం ఒక్కసారిగా కేసుల సంఖ్య రెండింతలు పెరిగింది. దేశంలో రెండు లక్షల కేసుల మార్కు దాటిన రాష్ట్రాల్లో కేరళ తొమ్మిదవది.