Keerthy Suresh: మరో అరుదైన గౌరవం దక్కించుకున్న ‘మహానటి’… ఈసారి ఫోర్బ్స్ జాబితాలో..
Keerthy In Forbes Under 30: పేరుకు తండ్రి నట వారసత్వమున్న తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది అందాల తార కీర్తి సురేష్. 2000 సంవత్సరంలో వచ్చిన మలయాళ చిత్రం 'పైలట్స్'తో బాలనటిగా కెరీర్ ప్రారంభించిన కీర్తి అనంతరం..
Keerthy In Forbes Under 30: పేరుకు తండ్రి నట వారసత్వమున్న తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది అందాల తార కీర్తి సురేష్. 2000 సంవత్సరంలో వచ్చిన మలయాళ చిత్రం ‘పైలట్స్’తో బాలనటిగా కెరీర్ ప్రారంభించిన కీర్తి అనంతరం హీరోయిన్గా ఎదిగింది. ఇక ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ‘మహానటి’తో ఒక్కసారిగా యావత్ భారతీయ చలన చిత్ర పరిశ్రమను తనవైపు తిప్పుకుంది. ఈ సినిమాలో తన అసమాన నటనతో సినీ ప్రపంచాన్ని ఆకట్టుకున్న కీర్తి.. జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఇక తాజాగా ఈ అందాల తార మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఫోర్బ్స్ ఇండియా నిర్వహించిన భారతదేశపు ప్రతిభావంతమైన యువ తారల వార్షిక జాబితాలో కీర్తి సురేష్కు చోటు దక్కింది. దేశవ్యాప్తంగా 30 సంవత్సరాలకు లోపల ఉన్న యువతీ యువకులు తమ తమ రంగాల్లో అత్యంత ప్రతిభ చూపించిన వారిలో కీర్తి నిలిచింది. వినోద రంగంలో కీర్తి ఈ ఘనత సాధించినట్లు ఫోర్బ్స్ ట్వీట్ చేసింది. ఇక ఇదే ట్వీట్ను రీట్వీట్ చేసిన కీర్తి.. ‘ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోవడం గర్వంగా ఉంది’ అంటూ కామెంట్ చేసింది.
Honored to be one among the different walks of fame in the #ForbesIndia30U30. Thank you so much @forbes_india. Humbled ??? https://t.co/1XIbARcDEX
— Keerthy Suresh (@KeerthyOfficial) February 3, 2021
Also Read: మెగా ఎఫెక్ట్.. వరుస ఆఫర్లు.. ఇప్పటికే చేతిలో మూడు సినిమాలు.. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే ?