కూటమికి షాక్: కాంగ్రెస్ ఎమ్మెల్యే మిస్సింగ్

బెంగళూరు: నేడు బలపరీక్ష నేపథ్యంలో కన్నడ నాట రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.  ఒకవైపు కూటమి మరోవైపు బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నాయి. కాంగ్రెస్‌ అసమ్మతి ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్‌ నేత రామలింగా రెడ్డి రాజీనామాను ఉపసంహరించుకున్న కొద్దిసేపటికే సంకీర్ణ ప్రభుత్వానికి షాక్‌ తగిలింది. బెంగళూరులోని ప్రకృతి రిసార్టుల్లో ఉంటున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీమంత కుమార్ బాలాసాహేబ్‌ పాటిల్‌ కనిపించకుండా పోయారు. దీంతో  పార్టీ శ్రేణులు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్యకు సమాచారం […]

కూటమికి షాక్: కాంగ్రెస్ ఎమ్మెల్యే మిస్సింగ్
Follow us

| Edited By:

Updated on: Jul 18, 2019 | 12:08 PM

బెంగళూరు: నేడు బలపరీక్ష నేపథ్యంలో కన్నడ నాట రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.  ఒకవైపు కూటమి మరోవైపు బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నాయి. కాంగ్రెస్‌ అసమ్మతి ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్‌ నేత రామలింగా రెడ్డి రాజీనామాను ఉపసంహరించుకున్న కొద్దిసేపటికే సంకీర్ణ ప్రభుత్వానికి షాక్‌ తగిలింది. బెంగళూరులోని ప్రకృతి రిసార్టుల్లో ఉంటున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీమంత కుమార్ బాలాసాహేబ్‌ పాటిల్‌ కనిపించకుండా పోయారు. దీంతో  పార్టీ శ్రేణులు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్యకు సమాచారం అందించారు. సీమంతకుమార్‌ పాటిల్‌ రాత్రి 8గంటల సమయంలో రిసార్టులో కనిపించారని, ఆతర్వాత ఆయన అదృశ్యమయ్యారని పార్టీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కోసం చుట్టు పక్కల ప్రాంతాలు, విమానాశ్రయంలో గాలించారు.