అమ్మ ఇడ్లీ కోసం ఎంత దూరం నడిచిందో.. తల్లి స్మృతుల్లో హారిస్
డెమొక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ నామినీ కమలా హారిస్ శనివారం తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇండియాతో అనుబందాన్ని కూడా నెమరువేసుకున్నారు.
డెమొక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ నామినీ కమలా హారిస్ శనివారం తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇండియాతో అనుబందాన్ని కూడా నెమరువేసుకున్నారు. ఇడ్లీ పట్ల ప్రేమ కలగడానికి తన తల్లి చేసిన ప్రయత్నాలను, తాతగారి సాయంతో సోదరి మాయ, తాను చైన్నై ప్రదేశాలను చుట్టివచ్చిన అనుభవాలను పంచుకున్నారు. “సౌత్ ఏషియన్స్ ఫర్ బిడెన్ ” కార్యక్రమంలో మాట్లాడిన ఆమె భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ, యుఎస్ దేశాల భాగస్వామ్యానికి చరిత్ర, సంస్కృతి ప్రధాన కారణాలని ఆమె వెల్లడించారు.
“నా తల్లి శ్యామల 19 సంవత్సరాల వయస్సులో కాలిఫోర్నియాలో విమానం దిగారు. ఆమె తనతో పాటు పెద్దగా వస్తువులను తెచ్చుకోలేదు. ఆ ఇంటి వద్ద నుంచి ఎన్నో పాఠాలను మోసుకొచ్చారు. అందులో ఆమె తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నవి కూడా ఉన్నాయి” అని కమలా హారిస్ పేర్కొన్నారు. ప్రముఖ క్యాన్సర్ పరిశోధకురాలు, సామాజిక కార్యకర్త అయిన తన తల్లి..ఆమె నేపథ్యం తెలియజేయడానికి తమను ఇండియా తీసుకెళ్లేవారని వివరించారు. తన గ్రాండ్ ఫాదర్ చెన్నై వీధుల్లో తిప్పుతూ స్వాతంత్ర్య సమదయోధుల గురించి వివరించేవారని చెప్పుకొచ్చారు.
కాగా ఇటీవల జో బిడెన్ తన పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ను ఎంపిక చేశారు. ఈ ఘనత పొందిన మొదటి ఆఫ్రికన్-అమెరికన్ మహిళ కమలా హారీస్. కాగా ఇప్పటికే ఆమెకు భారతీయుల నుంచి అపూర్వ మద్దతు లభిస్తోంది.
Also Read :
అలెర్ట్ : భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
పవన్ అభిమాని ప్రాణానికి సీఎం జగన్ అభయం
విశాఖ జిల్లాలో భారీ వర్షాలు…సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు