జేఎన్టీయూ డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా…
కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటికే పలు ఎగ్జామ్స్ వాయిదాపడ్డ విషయం తెలిసిందే. పదవ తరగతి పరీక్షలు అయితే ఏకంగా రద్దయ్యాయి. తాజాగా జేఎన్టీయూ పరిధిలోని డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ కూడా వాయిదా పడ్డాయి. జూన్- 20 నుండి జరగాల్సిన యూజీ, పీజీ ఎగ్జామ్స్ వాయిదా వేసినట్లు శుక్రవారం జేఎన్టీయూ అనౌన్స్ చేసింది. గవర్నమెంట్ ఆర్డర్ లేకుండా ఎటువంటి ఎగ్జామ్స్ నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నుంచి ఆదేశాలు అందిన పిమ్మట పరీక్షలు […]
కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటికే పలు ఎగ్జామ్స్ వాయిదాపడ్డ విషయం తెలిసిందే. పదవ తరగతి పరీక్షలు అయితే ఏకంగా రద్దయ్యాయి. తాజాగా జేఎన్టీయూ పరిధిలోని డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ కూడా వాయిదా పడ్డాయి. జూన్- 20 నుండి జరగాల్సిన యూజీ, పీజీ ఎగ్జామ్స్ వాయిదా వేసినట్లు శుక్రవారం జేఎన్టీయూ అనౌన్స్ చేసింది. గవర్నమెంట్ ఆర్డర్ లేకుండా ఎటువంటి ఎగ్జామ్స్ నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నుంచి ఆదేశాలు అందిన పిమ్మట పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు యూనివర్సిటీ అధికారులు.