జమ్మూలో పాకిస్థాన్ గూఢాచారి అరెస్ట్..

ప్రపంచ దేశాలు ఎట్టిమొట్టికాయలు వేసిన పాకిస్థాన్ వక్రబుద్ది ఏమాత్రం మారడంలేదు. భారతదేశంపై కుట్రలు, కుతంత్రాలు పన్నుతూనే ఉంది. తాజాగా మన దేశంలో వేగుల ద్వారా రహస్యాలను రాబట్టేందుకు పన్నిన పన్నాగాన్ని పోలీసులు ఛేదించారు.

జమ్మూలో పాకిస్థాన్ గూఢాచారి అరెస్ట్..
Follow us

|

Updated on: Oct 09, 2020 | 12:23 PM

ప్రపంచ దేశాలు ఎట్టిమొట్టికాయలు వేసిన పాకిస్థాన్ వక్రబుద్ది ఏమాత్రం మారడంలేదు. భారతదేశంపై కుట్రలు, కుతంత్రాలు పన్నుతూనే ఉంది. తాజాగా మన దేశంలో వేగుల ద్వారా రహస్యాలను రాబట్టేందుకు పన్నిన పన్నాగాన్ని పోలీసులు ఛేదించారు. పాకిస్థాన్ దేశం కోసం గూఢచర్యం చేస్తున్న ఓ వ్యక్తిని జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూకశ్మీరులోని సాంబ జిల్లాలోని ముఖ్యమైన ప్రాంతాల ఫోటోలను కుల్జీత్ అనే వ్యక్తి తీసి పాకిస్థాన్ దేశానికి పంపిస్తున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. 2018 నుంచి కుల్జీత్ జమ్మూకశ్మీరులోని కీలక ప్రాంతాల ఫొటోలు తీసి పంపిస్తున్నాడని విచారణలో వెల్లడైంది. ఇందుకు గానూ పాక్ కుల్జీత్ కు అధిక మొత్తంలో డబ్బు కూడా ముట్టజెప్పిందని పోలీసులు తేల్చారు. పక్కా సమాచారంతో విచారణ చేపట్టిన పోలీసులు పాక్ గూఢచారి కుల్జీత్ ను అరెస్ట్ చేసి అతని నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, కీలక ప్రాంతాల ఫొటోలు, పలు సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కుల్జీత్ ను కోర్టులో హాజరుపర్చగా, రిమాండుకు విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సరిహద్దుల్లో కీలకప్రాంతాల ఫొటోలను గూఢచారి పాక్ కు పంపించాడని వెల్లడైంది. పాక్ గూఢచారి కుల్జీత్ పై ఆర్డినెన్స్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేశామని సాంబ సీనియర్ ఎస్పీ రాజేశ్ శర్మ పేర్కొన్నారు.