జియో గుడ్ న్యూస్..ఆ ఆఫర్ ఇంకా మిగిలే ఉంది..?
రిలయన్స్ జియో టెలికాం రంగంలో ఎన్ని విప్లవాత్మక మార్పులను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు నెట్ ఇంత విసృతంగా వ్యాపించడానికి జియోనే కారణమనేది బహిరంగ రహస్యం. తక్కువ ధరలకే 4జీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో వినియోగదారులను ఆకట్టుకున్న జియో.. తరువాత జియో ఫోన్ను లాంచ్ చేసి మిగిలిన టెలికాం కంపెనీలకు నిద్ర పట్టకుండా చేసింది. కేవలం రూ.1500కే 4జీ ఫీచర్ఫోన్ను అందించింది. అయితే ఇప్పుడా ఫోన్ను కేవలం రూ.699కే కొనుగోలు చేయవచ్చు. దీపావళి సందర్భంగా ఇటీవలే […]
రిలయన్స్ జియో టెలికాం రంగంలో ఎన్ని విప్లవాత్మక మార్పులను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు నెట్ ఇంత విసృతంగా వ్యాపించడానికి జియోనే కారణమనేది బహిరంగ రహస్యం. తక్కువ ధరలకే 4జీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో వినియోగదారులను ఆకట్టుకున్న జియో.. తరువాత జియో ఫోన్ను లాంచ్ చేసి మిగిలిన టెలికాం కంపెనీలకు నిద్ర పట్టకుండా చేసింది. కేవలం రూ.1500కే 4జీ ఫీచర్ఫోన్ను అందించింది. అయితే ఇప్పుడా ఫోన్ను కేవలం రూ.699కే కొనుగోలు చేయవచ్చు. దీపావళి సందర్భంగా ఇటీవలే జియో ఈ ఆఫర్ను ప్రకటించింది. ఆఫర్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావటంతో పాటు ఆఫర్ను పొడిగించాలని కోరడంతో మరో నెల కొనసాగిస్తున్నట్టు తెలిపింది. ఫీచర్ ఫోన్ వినియోగదారులందరూ దీపావళి ఆఫర్ను వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని పొడిగించినట్టు పేర్కొంది. 2జీ ఫోన్ వినియోగదారులు ఈ పొడిగింపుతో తమ ఖాతాదారులుగా మారతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. 4జీ డివైస్ ప్లాట్ఫామ్లో నంబర్వన్గా రిలయన్స్ జియో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ ఆఫర్తో కొత్తగా కొనుగోలు చేసే జియోఫోన్పై 700 రూపాయల విలువ చేసే డాటాను అందిస్తోంది. ఇందులో భాగంగా కష్టమర్ చేసుకునే ఒక్కో రీచార్జ్కు అదనంగా 99 విలువైన డాటాను జియో అందిస్తుంది. మొదటి ఏడు రీచార్జ్లకు 99 రూపాయల విలువైన డాటాను జియో అదనంగా యాడ్ అవుతోంది. ఈ డాటాతో ఎంటర్టైన్మెంట్, పేమెంట్స్, ఈ కామర్స్, విద్య, శిక్షణ, రైలు, బస్ బుకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్లు మరెన్నో సౌకర్యాలు పొందువచ్చు. ఏది ఏమైనా జియో సంచలనాలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.