Jharkhand encounter: పోలీసులు-మావోయిస్టులకు ఎదురు కాల్పులు.. మావోయిస్టు ఏరియా దళ కమాండర్ హతం
జార్ఖండ్లో నిన్న అర్ధరాత్రి ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు ఏరియా దళ కమాండర్ హతం అయ్యాడు. రాంచీ...
జార్ఖండ్లో నిన్న అర్ధరాత్రి ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు ఏరియా దళ కమాండర్ హతం అయ్యాడు. రాంచీ జిల్లాలోని లోధ్మాలో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. దీంతో అటవీ ప్రాంతంలో భారీగా మోహరించిన పోలీసులు.. మంళవారం సాయంత్రం మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఛేట్ గ్రాంమ సమీపంలో పోలీసు బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో, పోలీసులు మావోలపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిషేధిత పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఏరియా కమాండర్ పునరై ఒరాన్ హతం కాగా, మిగితా మావోయిస్టు సభ్యులు తప్పించుకుని పారిపోయారు. మావోల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టినట్లు రాంచీ ఎస్ ఎస్పీ సురేందర్ ఝా తెలిపారు.
కాగా, గత వారం రోజుల కిందట ఖుంటీ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో పీఎల్ ఎఫ్ ఐ అగ్రనేత బైడెన్ గుడియా హతం అయ్యాడు. మావోయిస్టు పార్టీ వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు అగ్రనేతలను కోల్పోవడం సంచలనంగా మారింది. రాంచీ, గుల్మా, ఖుంటీ జిల్లాల్లో పునరై ఒరాన్ సుపరిచితుడు. అతని తలపై రూ.2 లక్షల రివార్డు కూడా ఉంది. పోలీసులు అతని కోసం చాలాకాలం నుంచి గాలిస్తున్నారు. ఒక్క రాంచీ జిల్లాలోనే 14 కేసులు నమోదయ్యాయి. వ్యాపారస్తులను బెదిరిస్తూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.