Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్పై విరుచుకుపడ్డ కాంగ్రెస్ మంత్రి.. సోషల్ మీడియాలో విమర్శించిన జావేద్ అక్తర్..
బాలీవుడ్ 'క్వీన్' కంగనా రనౌత్పై విమర్శల పర్వం కొనసాగుతోంది. భారత స్వాతంత్ర్య సమరం, మహాత్ముడిపై ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్పై విమర్శల పర్వం కొనసాగుతోంది. భారత స్వాతంత్ర్య సమరం, మహాత్ముడిపై ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. భారత్కు స్వాతంత్య్రం అనేది 2014లో వచ్చిందని, 1947లో మనకు లభించింది భిక్ష మాత్రమే అని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడే కంగనాపై విమర్శలు మొదలయ్యాయి. ఆమెకిచ్చిన పద్మ శ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని పలువురు ప్రముఖులు డిమాండ్ చేశారు. ఆమెపై పలు పోలీస్ స్టేషన్లలో దేశ ద్రోహం కేసులు నమోదయ్యాయి. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. ఈసారి ఏకంగా మహాత్మాగాంధీని లక్ష్యంగా చేసుకుంది. గాంధీ చెప్పినట్లు ఒక చెంప చూపితే స్వాతంత్య్రం రాదని, భిక్ష మాత్రమే వస్తుందని.. స్వాతంత్ర్య వీరులు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్కు గాంధీ మద్దతు లభించలేదని ఆమె వరుసగా ట్విట్టర్లో వరసగా పోస్ట్లు పెట్టారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో కలకలం సృష్టించాయి.
నాచ్నేవాలీ మాటలపై చర్చ అవసరం లేదు.. కాగా ఈ వ్యాఖ్యలకు నిరసనగా జార్ఖండ్, బిహార్ రాష్ట్రాలలో ఆమెపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ విజయ్ వాడ్డెటి వార్ కంగనాపై విరుచుకుపడ్డారు. ‘ గాంధీపై ఆమె చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవి. ఒక నాచ్నేవాలీ (ఐటం గర్ల్) చేసిన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోనవసరం లేదు. ఆమె గురించి ఎక్కువగా చర్చ అవసరం లేదు’ అని మంత్రి పరుష పదుజాలంతో మండిపడ్డారు. ఇక తాజాగా ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్ కంగనా వ్యాఖ్యలపై స్పందించారు. నేరుగా ఆమె పేరు ప్రస్తావించకుండానే ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు. ‘ఇది అందరికీ అర్థమయ్యేలా ఉంది. స్వాతంత్ర్యోదమంతో సంబంధంలేని కొంతమంది వ్యక్తులు మన స్వాతంత్ర్య పోరాటాన్ని ‘భిక్ష’ అని పిలుస్తున్నారు. ఇది వారికెందుకు బాధగా అనిపిస్తుంది’ అని రాసుకొచ్చారు.
Nani : ప్రతీసారి వర్కవుట్ కాకపోవచ్చు.. కానీ ఈ క్రిస్మస్ మనదే.. నాని ఇంట్రస్టింగ్ కామెంట్స్
Duniya Vijay: కన్నడ స్టార్ హీరో ఇంట మరో విషాదం.. అనారోగ్యంతో దునియా విజయ్ తండ్రి కన్నుమూత