Pawan Kalyan : విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు..
విజయవాడకు సమీపంలోని సీతానగరం కొండపైనున్న విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో జనసేన అధినేత పవన్కళ్యాణ్ సోమవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర, వరాహ స్వాముల ఆలయాలను దర్శించుకున్నారు.
Pawan Kalyan : విజయవాడకు సమీపంలోని సీతానగరం కొండపైనున్న విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో జనసేన అధినేత పవన్కళ్యాణ్ సోమవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర, వరాహ స్వాముల ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం చిన జీయర్ స్వామి వారి ఆశీసులు తీసుకున్నారు. స్వామివారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గుంటూరు పార్లమెంట్ జనసేన నాయకులు జోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జనసేన రాష్ట్ర కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావుతోపాటు పలువురు నేతలు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు.
కృష్ణా జిల్లా గుడివాడ, పెడన, మచిలీపట్నంలో జనసేన నిర్వహించిన ‘జై కిసాన్’ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నా.. మధ్య మధ్యలో దైవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. అంతేకాదు స్థానిక సామాజిక వర్గాల ప్రజలతో కలుస్తున్నారు. వారితో ముచ్చటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అరకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ ఆదివాసీలను కలిసి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. ఆంధ్ర-ఒరియా లో అడవితల్లితో ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని వివరిస్తూ వారు పాడిన పాట వింటూ మురిసిపోయారు. ఈ పాటను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.