బ్యాంకు ఖాతాలో డబ్బులు లేకపోయినా రూ.5,000 విత్డ్రా చేసుకోవచ్చు.. వారికే ఈ అవకాశం..
కోవిడ్-19..ప్రపంచం మొత్తాన్ని ఇళ్లకే పరిమితం చేసింది. అన్ని రంగాలపై ఈ మహమ్మారి వైరస్ వల్ల ఎఫెక్ట్ అయ్యాయి. భారత ఆర్థిక వ్యవస్థపై కూడా కరోనావైరస్ తీవ్ర ప్రతికూలతలు చూపింది.
కోవిడ్-19..ప్రపంచం మొత్తాన్ని ఇళ్లకే పరిమితం చేసింది. అన్ని రంగాలపై ఈ మహమ్మారి వైరస్ వల్ల ఎఫెక్ట్ అయ్యాయి. భారత ఆర్థిక వ్యవస్థపై కూడా కరోనావైరస్ తీవ్ర ప్రతికూలతలు చూపింది. ప్రజలంతా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వలస కూలీలు, డైలీ లేబర్ ఎక్కువ సమస్యలు ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో కనీస అవసరాలకు కూడా డబ్బులు లేకుండా ఇబ్బందులు పడేవారు..బ్యాంక్ ఖాతా లేకపోయినా సరే.. బ్యాంక్కు వెళ్లి రూ.5,000 విత్డ్రా చేసుకోవచ్చు. అయితే కేవలం జన్ ధన్ ఖాతా ఉన్నవారికి మాత్రమే ఈ సౌలభ్యం ఉంటుంది.
ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన పథకం కింద బ్యాంక్ ఖాతా లేని వారు.. ఈ జన్ ధన్ అకౌంట్ను ఓపెన్ చెయ్యెచ్చు. ఇది జీరో బ్యాలెన్స్ ఖాతా. దీన్ని ఫ్రీగానే తెరవొచ్చు. జన్ ధన్ అకౌంట్ కలిగిన వారికి రూ.5,000 ఓవర్ డ్రాఫ్ట్ తీసుకునే సౌలభ్యం ఉంది. అంటే బ్యాంక్ ఖాతాలో డబ్బులు లేకపోయినా అత్యవసర అవసరాల కోసం రూ.5,000 తీసుకోవచ్చు. అయితే ఇలా రూ.5,000 పొందాలంటే.. జన్ ధన్ ఖాతా కచ్చితంగా ఆధార్ కార్డుతో లింక్ అయ్యి ఉండాలి. మరో నిబంధన ఏంటంటే..రూ.5,000 తీసుకోవాలనుకుంటే జన్ ధన్ ఖాతా ఆరు నెలలుగా యాక్టివ్గా ఉండాలి. అంటే ఆరు నెలల నుంచి అకౌంట్లో డబ్బులు వేయడం, తీయడం వంటి యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు రూ.5,000 ఓవర్ డ్రాఫ్ట్ పొందే అవకాశం ఉంటుంది. ఇకపోతే జన్ ధన్ అకౌంట్ ద్వారా రూపే డెబిట్ కార్డు ఉచితంగా పొందొచ్చు. దీనికి రూ.లక్ష వరకు ప్రమాద ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది.