ఇరాక్లోని అమెరికా మిలటరీ బేస్ క్యాంప్లపై క్షిపణుల దాడులు!
చెప్పినట్లుగా ఇరాన్, అమెరికాపై ప్రతీకార కాంక్షతో రగిలిపోతోంది. తాజాగా యు.ఎస్ దళాలు ఉన్న రెండు ఇరాకీ స్థావరాలపై ఇరాన్ డజనుకు పైగా బాలిస్టిక్ క్షిపణులను పేల్చింది. పెంటగాన్ ఈ దాడిని ధృవీకరించింది. కాని అమెరికా సైనికులు ఎవరైనా చనిపోయారా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇరానియన్ జనరల్ ఖాసేం సోలైమాని హత్యకు మొదటి ప్రతీకారంగా ఈ దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ ఎలా స్పందిస్తాడు అన్నవిషయంపై యుద్దమేఘాలు కమ్ముకునే అవకాశం […]
చెప్పినట్లుగా ఇరాన్, అమెరికాపై ప్రతీకార కాంక్షతో రగిలిపోతోంది. తాజాగా యు.ఎస్ దళాలు ఉన్న రెండు ఇరాకీ స్థావరాలపై ఇరాన్ డజనుకు పైగా బాలిస్టిక్ క్షిపణులను పేల్చింది. పెంటగాన్ ఈ దాడిని ధృవీకరించింది. కాని అమెరికా సైనికులు ఎవరైనా చనిపోయారా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇరానియన్ జనరల్ ఖాసేం సోలైమాని హత్యకు మొదటి ప్రతీకారంగా ఈ దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ ఎలా స్పందిస్తాడు అన్నవిషయంపై యుద్దమేఘాలు కమ్ముకునే అవకాశం ఉంది. దాడులపై ట్రంప్కు నివేదిక సమర్పిస్తామని, ఆయన తదుపరి చర్యలు తీసుకుంటారని వైట్హౌస్ వర్గాలు తెలిపాయి.
పెంటగాన్ కథనం ఇలా ఉంది :
“జనవరి 7 న సాయంత్రం 5:30 గంటలకు ఇరాక్లోని యుఎస్ మిలిటరీ, సంకీర్ణ దళాలకు వ్యతిరేకంగా ఇరాన్ డజనుకు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ క్షిపణులను ఇరాన్ నుండి ప్రయోగించారని, అల్-అస్సాద్, ఇర్బిల్.. ఇరాకీ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారని స్పష్టమైంది. నష్టంపై అంచనా వేస్తున్నాం” అని పెంటగాన్ తెలిపింది.
#WATCH: Iran launched over a dozen ballistic missiles at 5:30 p.m. (EST) on January 7 and targeted at least two Iraqi military bases hosting US military and coalition personnel at Al-Assad and Irbil, in Iraq. pic.twitter.com/xQkf9lG6AP
— ANI (@ANI) January 8, 2020