IPL 2020: ఉత్కంఠ పోరులో కేకేఆర్ అద్భుత విజయం..
ఐపీఎల్ 2020లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ అదరగొట్టింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో..
IPL 2020: ఐపీఎల్ 2020లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ అదరగొట్టింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో కేకేఆర్ 2 పరుగుల తేడాతో విజయం సాధించి.. లీగ్లో నాలుగో విజయాన్ని అందుకుంది. అబుదాబీ వేదికగా జరిగిన మ్యాచ్లో ముందుగా కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కెప్టెన్ దినేష్ కార్తీక్(58), శుభ్మాన్ గిల్ (57) రాణించడంతో కేకేఅర్ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టుకు ఓపెనర్స్ కేఎల్ రాహుల్(74), మయాంక్ అగర్వాల్(56) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేకేఆర్ బౌలర్లు చివరి ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ వేశారు. ప్రసిద్ధ కృష్ణా మూడు వికెట్లు, నరైన్ రెండు వికెట్లతో కీలక పాత్ర పోషించారు.
Also Read: