నిండిపోయిన గ్యాలరీలు.. జగన్ కోసం వేచి చూస్తోన్న అభిమానులు

మరికాసేపట్లో నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుండగా.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఉదయం పది గంటల్లోపు వచ్చిన సాధారణ ప్రజలకు మాత్రమే గ్యాలరీల్లోకి అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేయగా.. అభిమానులు ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో ఉదయం 8.30గంటలకే గ్యాలరీలు నిండిపోయాయి. దీంతో స్టేడియం మొత్తం కిటకిటలాడుతోంది. మరోవైపు స్టేడియం ఇప్పటికే నిండిపోవడంతో.. ఇతర ప్రాంతాల […]

నిండిపోయిన గ్యాలరీలు.. జగన్ కోసం వేచి చూస్తోన్న అభిమానులు
Follow us

| Edited By:

Updated on: May 30, 2019 | 10:27 AM

మరికాసేపట్లో నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుండగా.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఉదయం పది గంటల్లోపు వచ్చిన సాధారణ ప్రజలకు మాత్రమే గ్యాలరీల్లోకి అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేయగా.. అభిమానులు ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో ఉదయం 8.30గంటలకే గ్యాలరీలు నిండిపోయాయి. దీంతో స్టేడియం మొత్తం కిటకిటలాడుతోంది. మరోవైపు స్టేడియం ఇప్పటికే నిండిపోవడంతో.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వైసీపీ అభిమానులను పోలీసులు విజయవాడ నలువైపులా ఉన్న శివార్లలోనే ఆపుతున్న పరిస్థితి నెలకొంది. కాగా12 గంటల్లోపే జగన్ స్టేడియానికి చేరుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రాత్రి కురిసిన వర్షంతో బెజవాడ మొత్తం చల్లబడి ఆహ్లాదకరంగా ఉంది.