అమెరికా సెనేటర్ బరిలో భారత సంతతి మహిళ
మరో భారతీయురాలికి అమెరికాలో అరుదైన గుర్తుంపు లభించింది. భారత్ లోనే కాదు విదేశాల్లోనూ రాజకీయంగా సత్తా చాటుతున్నారు. భారత సంతతికి చెందిన సారా గిడియాన్(48) అనే మహిళను అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మైనే రాష్ట్రం డెమొక్రటిక్ పార్టీ సెనెటర్ అభ్యర్థిగా ప్రకటించారు.
మరో భారతీయురాలికి అమెరికాలో అరుదైన గుర్తుంపు లభించింది. భారత్ లోనే కాదు విదేశాల్లోనూ రాజకీయంగా సత్తా చాటుతున్నారు. భారత సంతతికి చెందిన సారా గిడియాన్(48) అనే మహిళను అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మైనే రాష్ట్రం డెమొక్రటిక్ పార్టీ సెనెటర్ అభ్యర్థిగా ప్రకటించారు. గిడియాన్ తండ్రి భారతీయుడు కాగా, తల్లి అమెరికన్. గిడియాన్ ప్రస్తుతం మైనే స్టేట్ అసెంబ్లీ స్పీకర్గా కూడా కొనసాగుతున్నారు. నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ సెనేటర్ సుసాన్ కాలిన్స్కు గట్టి పోటీ ఇస్తున్నారని ఇటీవల వెలువడిన పోల్స్ ఫలితాల్లో వెల్లడైంది. ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న గిడియాన్ గెలుపు తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో గిడియాన్ను అభ్యర్థిగా నిలబెడితే ఆ సెనెటర్ స్థానం డెమొక్రటిక్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని పార్టీ నేతలు నమ్మకంగా ఉన్నారు.
ఇక, యూఎస్లో ప్రధాన సెనెటర్ స్థానాల్లో మైనే రాష్ట్రం కూడా ఒకటి. నవంబర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో ఇక్కడ అత్యధిక పోటీ ఏర్పడింది. దీంతో ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డెమొక్రటిక్ పార్టీ అధిష్టానం ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చేందుకు గిడియాన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఒబామా వ్యూహాత్మకంగా ఆమె పేరును తెరపైకి తీసుకువచ్చినట్లు సమాచారం. ఒకవేళ ఆమె ఎన్నికైతే అమెరికా సెనెట్కు ఎన్నికైన రెండో ఇండియన్ అమెరికన్ మహిళగా చరిత్రలో నిలుస్తారు. అంతకుముందు కాలిఫోర్నియా నుంచి తొలిసారి భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ అమెరికా సెనేట్కు ఎన్నికైన విషయం తెలిసిందే. మరోవైపు గిడియాన్ గెలుపుపై డెమొక్రటిక్ పార్టీ అధిష్టానం మంచి ధీమాతోనే ఉంది.