అంచనాల కంటే అధికంగా వృద్ధి రేటు.. ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంది ఆర్ బీ ఐ గవర్నర్ శక్తికాంత దాస్
భారత దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా ప్రభావం నుంచి కోలుకుంటోందని ఆర్ బీ ఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. రికవరీ రేటు అంచనాల కంటే అధికంగా ఉందని ఆయన తెలిపారు.
Indian Economy exhibited stronger than expected pick up భారత దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా ప్రభావం నుంచి కోలుకుంటోందని ఆర్ బీ ఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. వృద్ధి రేటు అంచనాల కంటే అధికంగా ఉందని ఆయన తెలిపారు. నవంబర్ 26న ఫారెన్ ఎక్స్ఛంజ్ డీలర్స్ నాలుగో వార్షికోత్సవంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారత ఆర్థిక వ్యవస్థ తొలి త్రైమాసికంలో 23.9 శాతం క్షిణించిందని అన్నారు. 2021 నాటికి ఇది 9.5 శాతానికి తగ్గనున్నట్లు తెలిపారు.
లాక్ డౌన్ సడలింపుతో దేశ ప్రజల కొనుగోలు శక్తి క్రమంగా పెరుగుతోందిని, తద్వారా ఆర్థిక పురోగతి మెరుగైనట్లు అర్థమవుతోందని వివరించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ తో పాశ్చాత్య దేశాలు ఇబ్బందిపడుతుండడంతో దాని ప్రభావం భారత్ పై ఉంటుందని అన్నారు. వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన అనంతరం ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు మరింత ఆస్కారం ఉంటుందన్న విశ్వాసాన్ని శక్తికాంత దాస్ వ్యక్తం చేశారు.