దేశంలో 30 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా విజృభణ కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 69,239 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్లో వెల్లడించింది.
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 69,239 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్లో వెల్లడించింది. మరో 912 మంది కరోనా కారణంగా చనిపోయారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 30 లక్షల మార్క్ను దాటింది.
దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 30, 44,940 ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 7,07,668 వ్యాధి బారి నుంచి కోలుకున్నవారు 22,80,566 మొత్తం కరోనాతో చనిపోయినవారి సంఖ్య 56,706
పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ రికవరీల సంఖ్య కూడా క్రమంగా పెరగడం కాస్త ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం ఇండియాలో కోవిడ్ బాధితుల రికవరీ రేటు దాదాపు 74.69శాతానికి చేరింది. మరణాల రేటు 1.87 శాతంగా ఉంది. దేశంలో రోజూ దాదాపు 8లక్షల శాంపిళ్లను టెస్ట్ చేస్తున్నారు.
Also Read :
వైఎస్ఆర్ ఆసరా స్కీమ్, రుణాలపై మార్గదర్శకాలు విడుదల