ఇండియాలో 29 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు వైరస్ తీవ్రత కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భారత్లో కొత్తగా 68,898 మంది పాజిటివ్ కేసులు నమోదవగా.. మరో 983 మంది ప్రాణాలు విడియారు.
దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భారత్లో కొత్తగా 68,898 మంది పాజిటివ్ కేసులు నమోదవగా.. మరో 983 మంది ప్రాణాలు విడిచారు. మొత్తం కేసులు 29 లక్షలు దాటాయి. ఇప్పటివరకు 21 లక్షల 58 వేల 946 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. మరణాల రేటు 1.89 శాతంగా ఉంది. దేశంలో ఆగస్టు 7న 20 లక్షల మార్కు దాటగా.. మరో 2 వారాల్లో 9 లక్షల కేసులు నమోదవటం ప్రమాదకర అంశం.
ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 3 కోట్ల 34 లక్షల 67 వేల 237 శాంపిల్స్ టెస్ట్ చేశారు. గురువారం ఒక్కరోజే రికార్డు రేంజ్లో 8 లక్షల 5 వేల 985 టెస్టులు చేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు: 6,920,28 కోలుకున్నవారు:21,589,47 మొత్తం మృతులు:54849 మొత్తం కేసులు:29,05,824
Also Read :
వాహనదారులకు బ్యాడ్ న్యూస్ : మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర !