జెరూసలెంలో హింసపై ఇండియా తీవ్ర ఆందోళన, ఉద్రిక్తతల నివారణకు ఉభయ పక్షాలు వెంటనే శాంతి చర్చలు చేపట్టాలని సూచన
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య పెరిగిన ఉద్రిక్తతలపట్ల ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జెరూసలేం లోని టెంపుల్ మౌంట్ తో బాటు షేక్ జర్రా, సిల్వాన్ ప్రాంతాల్లో ప్రజలను మూకుమ్మడిగా ఖాళీ చేయించడాన్ని...
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య పెరిగిన ఉద్రిక్తతలపట్ల ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జెరూసలేం లోని టెంపుల్ మౌంట్ తో బాటు షేక్ జర్రా, సిల్వాన్ ప్రాంతాల్లో ప్రజలను మూకుమ్మడిగా ఖాళీ చేయించడాన్ని ఖండిస్తున్నామని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్. తిరుమూర్తి అన్నారు. ఈ ప్రాంతాల్లో ఉభయ పక్షాలూ యథాతథ స్థితిని పునరుద్దరించే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. తూర్పు జెరూసలెంలో ఉద్రిక్తతలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయని, హరఫ్ అలీ టెంపుల్ మౌంట్ వద్ద జరిగిన ఘ్జర్షణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన ట్వీట్ చేశారు. ఇక్కడి ఓల్డ్ సిటీలో భారతీయులు కూడా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దయచేసి ఇంతకుమునుపున్న పరిస్థితిని మళ్ళీ పునరుద్ఝరించండి అని విజ్ఞప్తి చేశారు గాజా సిటీ నుంచి హమాస్ జరిపిన రాకెట్ దాడుల పట్ల కూడా ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, పాలస్తీనాలు శాంతికి కట్టుబడి ఉండాలన్న భద్రతా మండలి 2334 తీర్మానాన్ని ఆయన ప్రస్తావిస్తూ..ఇప్పటికైనా ఈ తీర్మానానికి అనుగుణంగా రెండు పక్షాలూ నడచుకోగలవన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దీని ఉల్లంఘన జరగరాదని కోరుతున్నామన్నారు.
ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ తక్షణమే అన్ని సెటిల్మెంట్ కార్యకలాపాలను నిలిపివేయాలని, పాలస్తీనా ప్రయోజనాలను గౌరవించాలని తిరుమూర్తి అన్నారు. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గెటెరిస్ కూడా ఆయన అభిప్రాయాలతో ఏకీభవించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలకు కట్టుబడి ఉండాలని ఆయన రెండు పక్షాలను కోరారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Viral Video : నాగుపామా..? అయితే నాకేంటి…షాకిచ్చిన బామ్మ.వామ్మో ఈ బామ్మ ధైర్యం చుస్తే షాక్ అవ్వాల్సిందే..(వీడియో).