మల్లెపూలలో మద్యం బాటిల్స్, ఆట కట్టించిన పోలీసులు
ఏపీలో మందుబాబులు...సరైన లిక్కర్ దొరక్క చిర్రెత్తిపోతున్నారు. ఈ క్రమంలో రకకరాల మార్గాల్లో బోర్డర్ రాష్ట్రాల నుంచి ఏపీలోకి మద్యం అక్రమ రవాణా పెరిగింది.
ఏపీలో మందుబాబులు…సరైన లిక్కర్ దొరక్క చిర్రెత్తిపోతున్నారు. ఈ క్రమంలో రకకరాల మార్గాల్లో బోర్డర్ రాష్ట్రాల నుంచి ఏపీలోకి మద్యం అక్రమ రవాణా పెరిగింది. అయితే టాస్క్ఫోర్స్ అధికారులు ఎక్కడికక్కడ దాడులు చేస్తూ అక్రమ రవాణా చేసేవారి ఆట కట్టిస్తున్నారు. అయితే మద్యాన్ని రవాణా చేసేందుకు వారు ఎన్నుకునే మార్గాలు చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. తాజాగా మల్లెపూల బస్తాల్లో మద్యం రవాణా చేస్తూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కారు.
కర్ణాటక నుంచి అనంతపురం జిల్లాలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కట్టడి చేయడానికి సివిల్, ఎక్సైజ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు. విస్తృత తనిఖీలు చేసి పట్టుకుంటున్నా కూడా అక్రమార్కులు ఈ లిక్కర్ దందా వీడటం లేదు. శనివారం రాత్రి పోలీసులు విడపనకల్లు చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు స్విఫ్ట్ డిజైర్ కారులో మల్లెపూల బస్తాలు తరలిస్తున్నారు. పోలీసులు ఆ కారును ఆపి చెక్ చేయగా తాము మల్లెపూల బిజినెస్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. పోలీసులకు వారి మాటలపై అనుమానం కలగడంతో మల్లెపూల బస్తాలను కిందకి దింపి పరిశీలించారు. లోపల పెద్ద ఎత్తున కర్ణాటక మద్యం సీసాలు బయటపడ్డాయి. వీస్కీ టెట్రా ప్యాకెట్లు 88, హైవార్డ్స్ బాటిల్స్ 87, 8 పీఎం బాటిల్స్ స్వాధీనం చేసున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు… కారు, మద్యం సీసాలను సీజ్ చేశారు.
Also Read :
వైఎస్సార్ ఆసరా నగదుపై ఆంక్షలు లేవు, ఉత్తర్వుల్లో తేల్చి చెప్పిన సర్కార్