ఈదురు గాలులు దంపతులను బలితీసుకున్నాయి…
మహబూబ్నగర్ జిల్లాలో భారి ఈదురుగాలులు ఓ కుటుంబంలో విషాదం మిగిల్చాయి. గాలి ధాటికి ఇద్దరు దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దురదృష్టకర ఘటన మిడ్జిల్ మండలంలోని మున్ననూర్ శివారులో మహబూబ్నగర్ – కోదాడ హైవేపై కొత్తగా నిర్మిస్తున్న టోల్గేట్ వద్ద జరిగింది. మున్ననూర్కు చెందిన డొంక కృష్ణయ్య, అతడి భార్య పుష్ప .. టోల్గేట్ వద్ద వరి ధాన్యాన్ని ఆరబెట్టారు. భారీ ఈదురుగాలులు వీస్తోన్న సమయంలో దంపతులు కూడా అక్కడే ఉన్నారు. గాలి ధాటికి ఒక్కసారిగా టోల్గేట్ […]
మహబూబ్నగర్ జిల్లాలో భారి ఈదురుగాలులు ఓ కుటుంబంలో విషాదం మిగిల్చాయి. గాలి ధాటికి ఇద్దరు దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దురదృష్టకర ఘటన మిడ్జిల్ మండలంలోని మున్ననూర్ శివారులో మహబూబ్నగర్ – కోదాడ హైవేపై కొత్తగా నిర్మిస్తున్న టోల్గేట్ వద్ద జరిగింది. మున్ననూర్కు చెందిన డొంక కృష్ణయ్య, అతడి భార్య పుష్ప .. టోల్గేట్ వద్ద వరి ధాన్యాన్ని ఆరబెట్టారు. భారీ ఈదురుగాలులు వీస్తోన్న సమయంలో దంపతులు కూడా అక్కడే ఉన్నారు. గాలి ధాటికి ఒక్కసారిగా టోల్గేట్ కుప్పకూలిపోయింది. భారీ ఇనుపకడ్డీలు మీద పడటంతో దంపతులిద్దరూ స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు.
కృష్ణయ్య, పుష్ప దంపతులు చనిపోవడంతో వారికున్న ఇద్దరు ఆడపిల్లలు అనాథలయ్యారు. అమ్మనాన్నలు విగత జీవులుగా పడిఉండటం చూసిన పిల్లలు గుక్కపట్టి ఏడ్చారు. అమ్మా లే అమ్మా.. అంటూ చిన్న కూతురు రోదించిన తీరు అక్కడ ఉన్నవారి మనసులను మెలిపెట్టింది.