Pm Svanidhi Scheme: కరోనా కష్టకాలంలో వీధి వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్రం నూతన పధకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ‘పీఎం స్వనిధి యోజన’ పధకం ద్వారా రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునేవారు, లాండ్రీ చేసేవారు, బండ్ల మీద విక్రయించేవారికి కేంద్రం రూ. 10,000 వరకు ఆర్ధిక సాయం అందించనుంది. ఈ పధకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 5,000 కోట్లను కేటాయించింది. వడ్డీ రాయితీతో వీధి వ్యాపారులు రూ. 10,000 వరకు లోన్ పొందవచ్చు. దీని ద్వారా 50 లక్షల మందికి లబ్ది చేకూరనుంది. లోన్ కోసం http://pmsvanidhi.mohua.gov.in అఫీషియల్ వెబ్సైట్ను సందర్శించండి.
Also Read:
సచివాలయాల్లో ఆధార్ సేవలు.. జగన్ సర్కార్ మరో సంచలనం!
సుశాంత్ ఆత్మతో మాట్లాడిన హుఫ్ పారానార్మల్.. షాకిస్తున్న వీడియో..!