జో బైడెన్ అధికారంలోకి వస్తే, ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ ఆశ
అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జో బైడెన్ గెలిచి అధికారంలోకి వఛ్చిన పక్షంలో గ్రీన్ కార్డుపై ఉన్న ఆంక్షలను తొలగిస్తారని భారత ఐటీ ప్రొఫెషనల్స్ ఆశిస్తున్నారు. వీరిలో చాలామంది అత్యంత నైపుణ్యం కలిగినవారు. హెచ్-1 బీ వీసా వర్క్ పై వఛ్చిన వీరు.. ప్రస్తుత ఇమ్మిగేషన్ విధానం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జో బైడెన్ ప్రెసిడెంట్ అయితే అమెరికాలో శాశ్వత నివాసానికి ఉద్దేశించిన గ్రీన్ కార్డు విధానంపై కొత్త చట్టం […]
అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జో బైడెన్ గెలిచి అధికారంలోకి వఛ్చిన పక్షంలో గ్రీన్ కార్డుపై ఉన్న ఆంక్షలను తొలగిస్తారని భారత ఐటీ ప్రొఫెషనల్స్ ఆశిస్తున్నారు. వీరిలో చాలామంది అత్యంత నైపుణ్యం కలిగినవారు. హెచ్-1 బీ వీసా వర్క్ పై వఛ్చిన వీరు.. ప్రస్తుత ఇమ్మిగేషన్ విధానం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జో బైడెన్ ప్రెసిడెంట్ అయితే అమెరికాలో శాశ్వత నివాసానికి ఉద్దేశించిన గ్రీన్ కార్డు విధానంపై కొత్త చట్టం తెఛ్చి ప్రస్తుత ఆంక్షలను ఎత్తివేస్తారని ఆశిస్తున్నట్టు ఇల్లినాయిస్ కి చెందిన రాజాకృష్ణమూర్తి, ఇంకా అమీ బేర్, ప్రమీలా జయపాల్ తదితరులు పేర్కొన్నారు. వర్చ్యువల్ గా జరిగిన సమావేశంలో పాల్గొన్న వీరు.. అధ్యక్షుడు ట్రంప్ ను మాత్రం పల్లెత్తు మాట అనకపోవడం విశేషం.