జనరేటర్ ద్వారా ఇంట్లోకి విషవాయువు.. వ్యక్తి మృతి..మీరు జాగ్రత్తగా ఉండండి..
పవర్ పోతే మీ అపార్ట్ మెంట్ లేదా కాలనీలో జనరేటర్ ఉపయోగిస్తున్నారా..అయితే తస్మాత్ జాగ్రత్త. తమిళనాడు కోయంబత్తూర్లోని పాలమేడులోని ఓ ఇంట్లో విషవాయువు ప్రాణాలు బలిగొంది. 49 ఏళ్ల బాలాజీ ఇంట్లో విషవాయుపు వ్యాపించిన కారణంగా చనిపోయాడు. హుడ్కో కాలనీలో నివాసముంటున్న వీరి కుటుంబంలో మరో ఇద్దరు తీవ్ర అస్వస్థకు గురై..ప్రమాదపు అంచున ఉన్నారు. సోమవారం ఉదయం 2:30గంటల సమయంలో బాలాజీ తండ్రి శ్రీధర్(72) స్నానాల గదిలో అపస్మారక స్థితిలో పడిపోయారు. అతని కోసం వెళ్లిన బాలజీ […]
పవర్ పోతే మీ అపార్ట్ మెంట్ లేదా కాలనీలో జనరేటర్ ఉపయోగిస్తున్నారా..అయితే తస్మాత్ జాగ్రత్త. తమిళనాడు కోయంబత్తూర్లోని పాలమేడులోని ఓ ఇంట్లో విషవాయువు ప్రాణాలు బలిగొంది. 49 ఏళ్ల బాలాజీ ఇంట్లో విషవాయుపు వ్యాపించిన కారణంగా చనిపోయాడు. హుడ్కో కాలనీలో నివాసముంటున్న వీరి కుటుంబంలో మరో ఇద్దరు తీవ్ర అస్వస్థకు గురై..ప్రమాదపు అంచున ఉన్నారు.
సోమవారం ఉదయం 2:30గంటల సమయంలో బాలాజీ తండ్రి శ్రీధర్(72) స్నానాల గదిలో అపస్మారక స్థితిలో పడిపోయారు. అతని కోసం వెళ్లిన బాలజీ అతని సోదరుడు మురళి(45) అక్కడే కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన వీరి తల్లి పద్మావతి ఇంటి పక్కన ఉండేవాళ్లకు విషయం చెప్పి..తీసుకువచ్చింది. స్థానికుల వచ్చి ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. బాలాజీ అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. అతని తండ్రి, సోదరునికి క్రిటికల్ కేర్ లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. జనరేటర్ నుంచే…ఇంటి బాత్రూంలోకి విషవాయువు వ్యాపించినట్లు తెలిసింది.