పాక్‌లో హిందువులపై దారుణాలు.. బలవంతంగా యువతి కిడ్నాప్‌.. ఆపై మతం మార్చి..

పాకిస్థాన్‌లో మైనార్టీలపై రోజురోజుకు ఆగడాలు పెరుగుతున్నాయి. హిందూ మతానికి చెందిన యువతులను నిత్యం కిడ్నాప్‌ చేసి.. ఆపై వారిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చుతున్నారు.

పాక్‌లో హిందువులపై దారుణాలు.. బలవంతంగా యువతి కిడ్నాప్‌.. ఆపై మతం మార్చి..
Follow us

| Edited By:

Updated on: Jun 24, 2020 | 12:02 PM

పాకిస్థాన్‌లో మైనార్టీలపై రోజురోజుకు ఆగడాలు పెరుగుతున్నాయి. హిందూ మతానికి చెందిన యువతులను నిత్యం కిడ్నాప్‌ చేసి.. ఆపై వారిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చుతున్నారు. ఆపై ఆ యువతులను ముస్లిం యువకులకిచ్చి వివాహం చేస్తున్నారు. ఇది పాక్‌లో నిత్యం మైనార్టీలైన హిందూ,సిక్కు, క్రైస్తవులపై జరుగుతున్న అరాచకాలు. తమ అమ్మాయిలు కిడ్నాప్‌ అయ్యారని ఎంత మొత్తుకున్నప్పటికీ.. ఆ బాధిత కుటుంబీకులు పోలీస్ స్టేషన్‌ మెట్లు ఎక్కినప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. ముఖ్యంగా సింధ్ ప్రావిన్స్‌లో ఈ సంఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా.. మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 18న రేషమన్‌ అనే ఓ హిందూ మైనర్‌ యువతిని వజీర్‌ హుస్సేన్‌ అనే యువకుడు బలవంతంగా కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆ యువతిని ఇస్లాంలోకి మతం మార్చి.. వివాహం చేసుకున్నాడు. ఈ సంఘటన సింధ్ ప్రావిన్స్‌లోని జాకోబాబాద్‌లో చోటుచేసుకుంది.

అయితే యువతులను కిడ్నాప్‌ చేసి.. భయబ్రాంతులకు గురిచేస్తూ.. తమ ఇష్టంతోనే మతం మారుతున్నామని.. వివాహం కూడా తమ ఇష్టంతోనే చేసుకుంటున్నామంటూ.. వారితో బలవంతంగా ప్రకటిస్తున్నారు. మైనర్ యువతులను కూడా కిడ్నాప్ చేసి.. వారు మేజర్ అంటూ తప్పుడు పత్రాలను సృష్టిస్తూ.. వివాహం చేసుకుంటున్నారు. వ్యతిరేకిస్తే.. తల్లిదండ్రులను హతమారుస్తామని బెదిరింపులకు దిగుతుండటంతో.. సదరు యువతులు మౌనంగా ఉండిపోతున్నారు. ప్రతి ఏటా.. దాదాపు 1000 నుంచి 2000 మంది యువతులు, వివాహితలు కిడ్నాప్‌కు గురవుతున్నారు. ఆ తర్వాత వారిని బలవంతంగా మతం మార్చుతూ.. వివాహాలు చేసుకుంటున్నారు.