Hero Nithin Visits Tirumala : కాలినడకన తిరుమల కొండెక్కిన యంగ్ హీరో.. సోషల్ మీడియాలో సెల్ఫీ
యంగ్ హీరో నితిన్ గత ఏడాది ఓ ఇంటివాడయిన విషయం తెలిసిందే. తన ప్రేయసి శాలినిని నితిన్ పెళ్లిచేసుకున్నాడు. ఇక పెళ్లితర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో ప్రస్తుతం నితిన్ 'రంగ్ దే'
Hero Nithin Visits Tirumala : యంగ్ హీరో నితిన్ గత ఏడాది ఓ ఇంటివాడయిన విషయం తెలిసిందే. తన ప్రేయసి శాలినిని నితిన్ పెళ్లిచేసుకున్నాడు. ఇక పెళ్లితర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో ప్రస్తుతం నితిన్ ‘రంగ్ దే’ అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తో పాటు నితిన్ చెక్ అనే సినిమా చేస్తున్నాడు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమలో రకుల్ ప్రీత్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నీతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నితిన్ తన భార్యతో కలిసి తిరుపతికి వెళ్లారు. కాలినడకన ఏడుకొండలు ఎక్కారు. కేవలం 2.20 గంటల్లోనే మెట్ల మార్గం గుండా తిరుమల చేరుకున్నట్టు నితిన్ సోషల్ మీడియాద్వారా తెలిపాడు. ఈమేరకు నితిన్ తన ఇన్స్టాగ్రామ్ లో సెల్ఫీని పోస్ట్ చేసాడు. తిరుమలలో నితిన్ ను చూసిన జనాలు అతనితో సెల్ఫీ దిగేందుకు ఎగబడ్డారు.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :
Samantha Tweet: ఈసారి ఎవరూ సేఫ్ కాదంటా… ‘ఫ్యామిలీ మ్యాన్’లో తన పాత్ర ఏంటో.. చెప్పకనే చెప్పిన సమంత.