రక్షణ కల్పించాలంటూ కోర్టుకు నవ దంపతులు…వారికే తిరిగి 10 వేల ఫైన్
వారు ప్రేమ వివాహాం చేసుకున్నారు. పెద్దలను నుంచి హెచ్చరికలు ఉండటంతో.. రక్షణ కల్పించాలంటూ పంజాబ్- హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు నవ దంపతులకు రూ.10 వేల ఫైన్ వేసింది.
వారు ప్రేమ వివాహాం చేసుకున్నారు. పెద్దల నుంచి హెచ్చరికలు ఉండటంతో.. రక్షణ కల్పించాలంటూ పంజాబ్- హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు నవ దంపతులకు రూ.10 వేల ఫైన్ వేసింది. ఈ ఘటన చండీగఢ్లో జరిగింది. అనంతరం వారికి రక్షణ కల్పించాలంటూ స్థానిక పోలీసులను ఆదేశించింది ధర్మాసనం.
అసలు ఏం జరిగిందంటే…
గురుదాస్పుర్కు చెందిన ఒక అమ్మాయి, అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే వారి పెళ్లికి పెద్దలు అంగీకారం దక్కలేదు. పైగా అంతు చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో భయపడిన ఆ జంట.. తమకు రక్షణ కల్పించాలంటూ మే 23న గురుదాస్పుర్ ఎస్పీని కలిసి విన్నవించుకున్నారు. అనంతరం హైకోర్టులోనూ తమ పెళ్లి రోజు దిగిన ఫోటోలను ప్రూఫులుగా పిటిషన్ను దాఖలు చేశారు. విచారణలో భాగంగా ఆ ఫోటోలను పరిశీలించిన హైకోర్టు… పెళ్లి సమయంలో వేడుకకు హాజరైన బంధుమిత్రులు, దంపతులు మాస్క్లు ధరించలేదని గుర్తించి.. వారికి రూ. 10 వేల ఫైన్ కట్టాలని ఆదేశించింది. అనంతరం నవ దంపతులకు రక్షణ కల్పించాలని స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.