హత్రాస్ కేసు, యూపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బెంగాల్ సీఎం దీదీ భారీ ర్యాలీ
యూపీలోని హత్రాస్ కేసులో ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, ఉదాసీనతను నిరసిస్తూ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యాన శనివారం కోల్ కతా లో భారీ ర్యాలీని నిర్వహిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలు..
యూపీలోని హత్రాస్ కేసులో ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, ఉదాసీనతను నిరసిస్తూ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యాన శనివారం కోల్ కతా లో భారీ ర్యాలీని నిర్వహిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొంటున్నారు.ఈ పార్టీకి చెందిన నలుగురు నేతల ప్రతినిధి బృందాన్ని యూపీ పోలీసులు హత్రాస్ సరిహద్దుల్లో నిన్న అడ్డగించారు. వీరికి, టీఎంసీ నాయకులకు మధ్య జరిగిన తోపులాటలో ఈ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ కిందపడిపోయి స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనను మమతా బెనర్జీ తీవ్రంగా పరిగణించారు. బాధితురాలి కుటంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న తమ పార్టీ నేతలపట్ల యూపీ పోలీసుల దుశ్చర్యను ఆమె ఖండిస్తూ, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
.@MamataOfficial, staunchly believes in equality. She never differentiates between Dalits, minorities or other communities. Under her leadership, today we hit the streets to protest against the uncouth @BJP4India leaders & demand justice for our Dalit women! #BJPHataoBetiBachao pic.twitter.com/QJdoqdmJL4
— All India Trinamool Congress (@AITCofficial) October 3, 2020