భాగ్యనగరంలో జల సిరి..భారీగా పెరిగిన గ్రౌండ్ వాటర్
ఈ ఏడాది భాగ్యనగరంలో రికార్డు రేంజ్ వర్షపాతం నమోదైంది. అక్టోబర్లో వర్షాల తీవ్రతకు వరద పోటెత్తిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది భాగ్యనగరంలో రికార్డు రేంజ్ వర్షపాతం నమోదైంది. అక్టోబర్లో వర్షాల తీవ్రతకు వరద పోటెత్తిన విషయం తెలిసిందే. సాధారణం కంటే ఏకంగా 86 శాతం వర్షపాతం నమోదైంది. గత వందేళ్లలో రెండో అత్యధిక వర్షపాతం అని చెబుతున్నారు. రంగారెడ్డి, మేడ్చల్లో ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఉంది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలోని ఎల్బీ నగర్, సరూర్ నగర్, శేరిలింగంపల్లి, రాజేంద్ర నగర్ తదితర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పైకి వచ్చాయి. హైదరాబాద్లో 2.64 మీటర్లు పైకి వచ్చాయి. దీంతో వేసవిలో నీటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. భూగర్భ జలాల పెరుగుదలకు ఇంకుడు గుంతలే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో గతంలో దాదాపు లక్ష ఇంకుడు గుంతలు నిర్మించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంకుడు గుంతలు చాలా అవసరమని, తద్వారా ఎండిన బోర్లు కూడా వాడుకలోకి తేవొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : పోలీసుశాఖలో సైంటిఫిక్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్