పబ్జీ బ్యాన్.. కేంద్రం కీలక నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పబ్జీ సహా 118 చైనా యాప్స్ను నిషేధించింది. వీటిలో పబ్జీ, క్యామ్ కార్డ్, బైడు, కట్కట్ సహా మొత్తం 118 యాప్లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ నిర్ణయం తీసుకుంది...
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పబ్జీ సహా 118 చైనా యాప్స్ను నిషేధించింది. వీటిలో పబ్జీ, క్యామ్ కార్డ్, బైడు, కట్కట్ సహా మొత్తం 118 యాప్లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో గల్వాన్ లోయ వద్ద ఘర్షణల సమయంలో దేశ భద్రత, రక్షణ దృష్ట్యా టిక్టాక్ సహా అనేక యాప్లపై కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ నిషేధం విధిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత్ మరో భారీ దెబ్బ కొట్టింది.
భారత్లో ఈ గేమింగ్ యాప్ను అందుబాటులో లేకుండా గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు. పబ్జీ యాప్ను మన దేశంలో దాదాపు 50 మిలియన్ల మందికి పైగా వినియోగిస్తున్నారు.
Ministry of Information & Technology bans PUBG and 118 other mobile applications pic.twitter.com/3bnFiaY9VW
— ANI (@ANI) September 2, 2020
ప్లే స్టేషన్ల, కంప్యూటర్లలో అందుబాటులో ఉన్న ఈ ఆట.. స్మార్ట్ పోన్లు వచ్చిన తర్వాత అందరి చేతుల్లోకి వచ్చిది. ఫిబ్రవరి 9, 2018న మొబైల్ వెర్షన్లో మన దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. విడుదలైన తొలి ఏడాదే ప్లే స్టోర్లో ఉత్తమ యాప్గా నిలిచింది. ఆ తర్వాత లో ఎండ్ మొబైల్స్ కోసం 2019 ఆగస్టులో పబ్జీ లైట్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు నిర్వాహకులు.
అతి తక్కువ సమయంలో పబ్జీకి ప్రపంచంలోని పెద్ద దేశాల్లోనే కాదు భారత్లోనూ విశేష ఆదరణ లభించింది. ముఖ్యంగా యువత ఈ ఆటపట్ల ఎంతో ఆసక్తి కనబరిచారు. ఏ మాత్రం సమయం దొరికినా ఈ ఆటలోనే ఉండిపోతున్నారు. ఒక్క భారత్లోనే 50మిలియన్లకు పైగా డౌన్ లోడ్స్ ఉన్నాయంటే పబ్జీకి ఉన్న క్రేజ్ ఏమిటో అర్థంచేసుకోవచ్చు. ఈ ఆట కోసం నిద్రాహారాలు మాని అనేకమంది ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. పబ్జీ గేమ్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా బ్రెండన్ గ్రీన్, జాంగ్ టె-సియాక్ ఉన్నారు. 2000 సంవత్సరంలో జపనీస్ చిత్రం బ్యాటిల్ రాయల్ స్ఫూర్తితో దీన్ని రూపొందించారు.