కూకట్పల్లి జోన్లో గులాబీ హవా..అత్యధిక స్థానాలలో టీఆర్ఎస్ ఘనవిజయం
రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. మొదట లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అనుహ్య రీతిలో బీజేపీ అత్యధిక ఓట్లను సాధించింది. మెజార్టీ డివిజన్లలో..
రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. మొదట లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అనుహ్య రీతిలో బీజేపీ అత్యధిక ఓట్లను సాధించింది. మెజార్టీ డివిజన్లలో టీఆర్ఎస్పై పూర్తిస్థాయిలో బీజేపీ ఆదిపత్యం ప్రదర్శించింది. కానీ, సాధారణ ఓట్ల లెక్కింపు మొదలైన ఫస్ట్ రౌండ్లోనే టీఆర్ఎస్ హవా మొదలైంది. ఒకటి, రెండు, మూడు,..ఇలా గులాబీ పార్టీ విజయం సాధించిన స్థానాల సంఖ్యలో పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా కూకట్పల్లి జోన్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కూకట్పల్లి జోన్లో ఉన్న 22 డివిజన్లలో 20 డివిజన్లలో టీఆర్ఎస్ విజయం సాధించింది.