ghmc elections: కాంగ్రెస్ నేత మల్లు రవి ఓటు గల్లంతు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. నగరంలో పలుచోట్ల ఆన్లైన్లో పేరున్నా.. లిస్టులో లేకపోవడంతో వెనుకకు తిరుగుతున్నారు.
ghmc elections: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. నగరంలో పలుచోట్ల ఆన్లైన్లో పేరున్నా.. లిస్టులో లేకపోవడంతో వెనుకకు తిరుగుతున్నారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ కీలక నేత మాజీ ఎంపీ ఓటు గల్లంతు కావడం కలకలం రేపుతోంది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి ఓటు ఓటు వేసేందుకు వచ్చారు. అయితే, ఓటర్ లిస్టులో ఆయన పేరు లేకపోవడంతో అవాక్కయ్యారు. దీంతో ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు.
కాగా.. పలు చోట్ల పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతు అయ్యాయని ఓటర్లు వాపోయారు. జియాగూడ పోలింగ్ బూత్ నెం.38లో ఓట్లు గల్లంతవడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. ఈ పోలింగ్ బూత్ పరిధిలో మొత్తం 914 ఓట్లకు 657 ఓట్లు గల్లంతు అయ్యాయి. ఆన్లైన్ ఓటర్ లిస్ట్లో ఓటు ఉన్నా.. పోలింగ్ బూత్ వద్ద లిస్ట్లో చూపించడం లేదని ఓటర్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్ స్లిప్లు వచ్చినప్పటికీ ఓట్లు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అంతసేపు క్యూలైన్లో నిలుచుని పేరు లేకపోవడంతో ఓటర్లు నిరాశగా వెను తిరుగుతున్నారు.