GHMC Elections 2020: ఓటు హక్కు కోసం 300 కిలోమీటర్లు నుంచి వచ్చిన నటుడు, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపు

గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్‌ సరళి మందకొడిసా సాగుతుంది. మధ్యాహ్నం 12 గటంలవుతున్నా ఓటర్లు ఇల్లు విడిచి బయటకి రావడం లేదు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 300 కిలోమీటర్ల దూరం..

GHMC Elections 2020: ఓటు హక్కు కోసం 300 కిలోమీటర్లు నుంచి వచ్చిన నటుడు, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపు
Follow us

|

Updated on: Dec 01, 2020 | 5:59 PM

గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్‌ సరళి మందకొడిసా సాగుతుంది. మధ్యాహ్నం 12 గటంలవుతున్నా ఓటర్లు ఇల్లు విడిచి బయటకి రావడం లేదు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 300 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఓటు వేశాడు.

నటుడు, నిర్మాత, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి 300 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు. గుంటూరులో షూటింగ్ జరుగుతుంటే, దాన్ని ఆపేసి తాను ఓటు వేయడానికి వచ్చినట్టు తెలిపారు

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఎంత ముఖ్యమో, మున్సిపల్ ఎన్నికలు కూడా అంతే ముఖ్యమని ఓటర్లు గుర్తించాలన్నారు శివాజీరాజా. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.