బల్దియా ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్
బల్దియా ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. GHMC ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ ఏడో తేదీన ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటించనుంది. నవంబర్ 9న వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో GHMC కమిషనర్ సమావేశం అవుతారు. ఓటర్ల జాబితాపై 11వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇక 13న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. GHMCఎన్నికల కోసం 2016 నాటి రిజర్వేషన్లు , వార్డుల […]
బల్దియా ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. GHMC ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ ఏడో తేదీన ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటించనుంది. నవంబర్ 9న వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో GHMC కమిషనర్ సమావేశం అవుతారు. ఓటర్ల జాబితాపై 11వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇక 13న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. GHMCఎన్నికల కోసం 2016 నాటి రిజర్వేషన్లు , వార్డుల విభజననే కొనసాగిస్తున్నట్లు పురపాలక శాఖ అధికారులు ఎన్నికల కమిషనర్ పార్థసారథికి తెలిపారు. GHMC ప్రస్తుత పాలక మండలి గడువు ఫిబ్రవరి 10తో ముగియనుంది. గడువులోపే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పురపాలక, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, కమిషనర్లు అరవింద్ కుమార్, లోకేశ్కుమార్లతో పార్థసారథి సమావేశమయ్యారు. GHMC ఎన్నికల సన్నద్ధతపై వారితో చర్చించారు. ఎన్నికల ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించాలని సూచించారు. పకడ్బందీగా ఓటర్ల జాబితా తయారు చేయాలని ఎస్ఈసీ అధికారులను పార్థసారథి ఆదేశించారు.