యూఎస్ ఓపెన్లో మరో సంచలనం..
యూఎస్ ఓపెన్లో సంచలనాలు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ మరో సంచలనం నమోదయ్యింది. దాదాపు 26 ఏండ్ల తర్వాత జర్మనీకి చెందిన ఓ ఆటగాడు యూఎస్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టాడు.
US open : యూఎస్ ఓపెన్లో సంచలనాలు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ మరో సంచలనం నమోదయ్యింది. దాదాపు 26 ఏండ్ల తర్వాత జర్మనీకి చెందిన ఓ ఆటగాడు యూఎస్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. న్యూయార్క్లో జరిగిన సెమీ ఫైనల్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ స్పెయిన్ ఆటగాడు పబ్లో కారెనో బస్టాపై విజయం సాధించాడు.
తొలి రెండు సెట్లలో తడబడిన అలెగ్జాండర్.. ఆ తర్వాత వేగంగా పుంజుకున్నాడు. దీంతో బస్టాపై 3-6, 2-6, 6-3, 6-4, 6-3తో జయకేతనం ఎగురవేశాడు.
ఈ విజయంతో 1994 తర్వాత యూఎస్ ఓపెన్ సింగిల్స్ ఫైనల్కు చేరుకున్న మొదటి జర్మన్ ఆటగాడిగా జ్వెరెవ్ చరిత్రలోకి ఎక్కాడు. 1994లో మైఖేల్ స్టిచ్ యూఎస్ ఫైనల్లో ఆడాడు. కాగా, ఆదివారం జరగనున్న ఫైనల్లో ఐదో సీడ్ జ్వెరెవ్ డొమినిక్ థీమ్తో తలపడనున్నాడు.
1️⃣st US Open final feeling ? pic.twitter.com/9Im3GAocwP
— US Open Tennis (@usopen) September 12, 2020