యూఎస్ ఓపెన్‌లో మరో సంచ‌ల‌నం..

యూఎస్ ఓపెన్‌లో సంచ‌ల‌నాలు నమోదవుతున్నాయి. క‌రోనా మహ‌మ్మారి విజృంభిస్తున్న వేళ మ‌రో సంచ‌ల‌నం న‌మోద‌య్యింది. దాదాపు 26 ఏండ్ల త‌ర్వాత జ‌ర్మ‌నీకి చెందిన ఓ ఆట‌గాడు యూఎస్ ఓపెన్ ఫైన‌ల్‌లో అడుగుపెట్టాడు.

యూఎస్ ఓపెన్‌లో మరో సంచ‌ల‌నం..
Follow us

|

Updated on: Sep 12, 2020 | 10:31 AM

US open : యూఎస్ ఓపెన్‌లో సంచ‌ల‌నాలు నమోదవుతున్నాయి. క‌రోనా మహ‌మ్మారి విజృంభిస్తున్న వేళ మ‌రో సంచ‌ల‌నం న‌మోద‌య్యింది. దాదాపు 26 ఏండ్ల త‌ర్వాత జ‌ర్మ‌నీకి చెందిన ఓ ఆట‌గాడు యూఎస్ ఓపెన్ ఫైన‌ల్‌లో అడుగుపెట్టాడు. న్యూయార్క్‌లో జ‌రిగిన సెమీ ఫైన‌ల్‌లో జ‌ర్మ‌నీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ స్పెయిన్ ఆట‌గాడు ప‌బ్లో కారెనో బ‌స్టాపై విజ‌యం సాధించాడు.

తొలి రెండు సెట్ల‌లో త‌డ‌బ‌డిన అలెగ్జాండ‌ర్.. ఆ త‌ర్వాత వేగంగా పుంజుకున్నాడు. దీంతో బ‌స్టాపై 3-6, 2-6, 6-3, 6-4, 6-3తో జ‌య‌కేత‌నం ఎగుర‌వేశాడు.

ఈ విజయంతో 1994 త‌ర్వాత యూఎస్ ఓపెన్ సింగిల్స్ ఫైనల్‌కు చేరుకున్న మొదటి జర్మన్ ఆట‌గాడిగా జ్వెరెవ్ చరిత్రలోకి ఎక్కాడు. 1994లో మైఖేల్ స్టిచ్ యూఎస్ ఫైన‌ల్‌లో ఆడాడు. కాగా, ఆదివారం జర‌గ‌నున్న‌ ఫైనల్లో ఐదో సీడ్ జ్వెరెవ్ డొమినిక్ థీమ్‌తో త‌ల‌ప‌డ‌నున్నాడు.