మహాత్ముడికి అవమానం.. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదం!

నిజామాబాద్ జిల్లా గుండారంలో మహాత్మాగాంధీ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. కొంతమంది దుండగులు విగ్రహానికి నల్లరంగు పూసి పాకిస్థాన్ జిందాబాద్ అంటూ ప్లకార్డులు రాసి వాటిని గాంధీ విగ్రహం మెడలో వేసిన దృశ్యం కలకలం రేపింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గుర్తు తెలియని దుండగులు చేసిన ఈ చర్యతో గుండారం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ దుండగులు గాంధీ విగ్రహానికి నల్లరంగు పూసి అవమానించటమే కాకుండా పాకిస్థాన్ జిందాబాద్ అంటూ పోస్టర్లను విగ్రహానికి కట్టారు. దానితో […]

మహాత్ముడికి అవమానం.. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదం!
Follow us

| Edited By: Srinu

Updated on: Aug 26, 2019 | 12:54 PM

నిజామాబాద్ జిల్లా గుండారంలో మహాత్మాగాంధీ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. కొంతమంది దుండగులు విగ్రహానికి నల్లరంగు పూసి పాకిస్థాన్ జిందాబాద్ అంటూ ప్లకార్డులు రాసి వాటిని గాంధీ విగ్రహం మెడలో వేసిన దృశ్యం కలకలం రేపింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

గుర్తు తెలియని దుండగులు చేసిన ఈ చర్యతో గుండారం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ దుండగులు గాంధీ విగ్రహానికి నల్లరంగు పూసి అవమానించటమే కాకుండా పాకిస్థాన్ జిందాబాద్ అంటూ పోస్టర్లను విగ్రహానికి కట్టారు. దానితో పాటు షాదుల్‌ను వెంటనే విడుదల చేయాలని ప్లకార్డులను ఆయన మెడలో వేశారు. ఇక గ్రామంలో ఈ ఘటనకు పాల్పడిన దుండగులు ఎవరు అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భారత దేశంలో ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఈవిధమైన దుర్మార్గపు పనులు భారతదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించే పాకిస్తాన్ సానుభూతిపరులను ఈ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదు అనే ఆలోచన ప్రజలలో మొదలైంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో దేశవిద్రోహ శక్తులు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.