ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం.. పండంటి మగ శిశు జననం..!

ఆర్టీసీ బస్సులోనే మహిళ ప్రసవించిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. గట్టు మండలంలోని ఆరేగిద్ద గ్రామానికి చెందిన గోపాలమ్మ బుధవారం ఆర్టీసీ బస్సులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నిండు గర్భిణి అయిన గోపాలమ్మ చికిత్స కోసం బుధవారం ఆరేగిద్ద నుంచి గట్టులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆర్టీసీ బస్సులో బయలుదేరింది. కానీ, మార్గమధ్యంలోనే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో తోటి మహిళా ప్రయాణికులే ఆమెకు పురుడు పోశారు. దీంతో మహిళ పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. […]

ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం.. పండంటి మగ శిశు జననం..!
Follow us

|

Updated on: May 27, 2020 | 5:14 PM

ఆర్టీసీ బస్సులోనే మహిళ ప్రసవించిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. గట్టు మండలంలోని ఆరేగిద్ద గ్రామానికి చెందిన గోపాలమ్మ బుధవారం ఆర్టీసీ బస్సులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నిండు గర్భిణి అయిన గోపాలమ్మ చికిత్స కోసం బుధవారం ఆరేగిద్ద నుంచి గట్టులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆర్టీసీ బస్సులో బయలుదేరింది. కానీ, మార్గమధ్యంలోనే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో తోటి మహిళా ప్రయాణికులే ఆమెకు పురుడు పోశారు. దీంతో మహిళ పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం అదే బస్సులో గోపాలమ్మను గట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ మహిళకు చికిత్స అందించిన అనంతరం తల్లీ బిడ్డ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.