ఒడిశాలో ఘోర ప్రమాదం.. రూర్‌కెలా స్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ లీక్.. నలుగురు మ‌ృతి, పది మందికి గాయాలు..!

కోల్ కెమిక‌ల్ డిపార్ట్‌మెంట్ ప్లాంట్ నుంచి కలుషితమైన గాలి వ్యాపించింది. దాన్ని పీల్చిన న‌లుగురు కార్మికులు మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు తెలిపారు.

ఒడిశాలో ఘోర ప్రమాదం.. రూర్‌కెలా స్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ లీక్.. నలుగురు మ‌ృతి, పది మందికి గాయాలు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 06, 2021 | 3:12 PM

Odisha Toxic Gas Leakage : ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. రూర్‌కెలా స్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ లీకై నలుగురు మృత్యువాత పడగా, 10 మందికి గాయాలయ్యాయి. బుధ‌వారం ఉద‌యం స్టీల్ ప్లాంట్‌లోని ఓ యూనిట్‌లో ఒక్కసారిగా విష‌పూరిత గ్యాస్ లీకైన‌ట్లు అధికారులు గుర్తించారు. కోల్ కెమిక‌ల్ డిపార్ట్‌మెంట్ ప్లాంట్ నుంచి కలుషితమైన గాలి వ్యాపించింది. దాన్ని పీల్చిన న‌లుగురు కార్మికులు మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు తెలిపారు. ప్రమాద స‌మ‌యంలో ప్లాంట్‌లో 15 మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. స్పృహ త‌ప్పిప‌డిపోయిన వారిని ప్లాంట్ స‌మీపంలో ఉన్న హాస్పిట‌ల్‌లో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ నలుగురు మృతిచెందారు.

కాగా, మరికొందరు క్షతగాత్రులను ఇస్పాట్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌కి తరలించారు. మిగిలినవారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. గ్యాస్ లీకేజీకి సంబంధించి సమాచారం అందుకున్న అగ్ని మాప‌క సిబ్బంది అక్కడ‌కు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. కోల్ కెమిక‌ల్ సైట్‌లోని సేఫ్టీ వాల్వ్ స‌డ‌న్‌గా పేల‌డం వ‌ల్ల ఈ ప్రమాదం జ‌రిగిన‌ట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Read More:

పీసీపీ ఛీప్‌ ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ.. సాగర్ ఉప ఎన్నిక వరకు పెండింగ్.. అధిష్ఠానం ఎందుకు ఇలా చేస్తోందంటే..

Megastar chiranjeevi: సీఐ శ్యాం సుందర్‏కి సెల్యూట్ చెప్పిన చిరంజీవి.. అతడి కళ్ళలో గర్వాన్ని చూశానంటూ..

కడప నగరంలో వేడుకలా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం, సీఎం జగన్ పథకాలు దేశానికే ఆదర్శనీయమన్న నేతలు