ఆఫ్ఘనిస్థాన్లో గురువారం భారీ పేలుడు సంభవించింది. కాందహార్ ప్రావిన్స్లో జరిగిన ఈ ఘటనలో నలుగురు పౌరులు మృతిచెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. పంజావాయి జిల్లాలో గురువారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు మహిళలతో పాటుగా ఓ చిన్నారి కూడా ఉన్నారు. మరో నలుగురు పిల్లలు, ఓ మహిళతో పాటుగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు పాల్పడింది ఎవరన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
Read More :
రాజస్థాన్లో తాజాగా మరో 608 పాజిటివ్ కేసులు
“మహా” పోలీసులను వణికిపోస్తున్న కరోనా మహమ్మారి