తాలిబన్ ఉగ్రవాదుల దుశ్చర్య.. మాజీ సెనేటర్ను కిడ్నాప్ చేసి..
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మొన్నటి వరకు ప్రభుత్వాధికారులు, సైన్యం లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. తాజాగా మాజీ సెనేటర్ను లక్ష్యంగా దాడికి దిగారు.
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మొన్నటి వరకు ప్రభుత్వాధికారులు, సైన్యం లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. తాజాగా మాజీ సెనేటర్ను లక్ష్యంగా దాడికి దిగారు. ఆఫ్ఘనిస్థాన్కు చెందిన మాజీ సెనేటర్ అబ్దుల్ వలీ అహ్మద్జైని కాల్చి చంపేశారు. ఈ సంఘటన పొల్-ఈ-అలం ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇది కాబుల్ సమీపంలోని లోగర్ ఈస్టర్న్ ప్రావిన్స్ ఉంటుంది. మొదట సదరు సెనేటర్ను కిడ్నాప్ చేసి.. ఆ తర్వాత ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం నాడు తన సోదరి అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా.. తాలిబన్ ఉగ్రవాదులు ఇతడిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఎలాంటి ప్రకటన కూడా చేయకుండానే.. పొల్-ఈ-అలం ప్రాంతంలోనే కాల్చి చంపేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. అయితే ఈ సంఘటనపై ఇప్పటి వరకు కూడా తాలిబన్ ఉగ్రవాదులు ఎలాంటి ప్రకటన చేయలదేని.. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు.. ఘటనకు బాధ్యత తామేనంటూ ప్రకటనలు చేసేవారని పోలీసులు తెలిపారు.